mahesh goud

సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ : మహేష్ గౌడ్

సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రకటించారు.
అలాగే కాంగ్రెస్‌లో చేరికలు కూడా జోరుగా ఉంటాయన్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ప్రకటన ఉంటుందని తెలిపారు పీసీసీ చీఫ్. శనివారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ మాట్లాడుతూ.. సంక్రాంతి తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తామని ప్రకటించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు చేస్తున్నామని.. సంకాంత్రి తర్వాత చేరికలు ఉంటాయని వెల్లడించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర పక్షాలకు మద్దతు ఇస్తామన్నారన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని రెండు, మూడు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ, మాజీ అధికారి గంగాధర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వెల్లడించారు. వచ్చే 20 ఏండ్లను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని హైకమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చిందని తెలిపారు. ఈ నెల చివరి నాటికి పార్టీలో అన్ని కమిటీలను నియమిస్తామని తెలిపారు. కార్పోరేషన్ పదవుల భర్తీ నెలలోపు అయిపోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.

కాగా.. గత కొద్దినెలలుగా తెలంగాణ కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అంతా భావించారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దలతో చర్చలు కూడా జరిపారు.

అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండగా.. ఈ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు వెళ్లనున్నారు. ఈ క్రమంలో రేవంత్ పర్యటన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం కానుందని కాంగ్రెస్‌ వర్గాలే చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్వయంగా మంత్రి వర్గ విస్తరణపై ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.

Related Posts
వరంగల్ విమానాశ్రయ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్
వరంగల్ విమానాశ్రయ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో విమాన సదుపాయాల విస్తరణలో భాగంగా వరంగల్ ముమునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ Read more

రైతు భరోసాపై బీఆర్ఎస్ నిరసనలు
brs rythu bharosa protest

తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల Read more

రేపటి టీజీ టెట్ కు అంతా సిద్ధం
tet exame

రేపటినుంచి జరుగనున్న టీజీ టెట్ – 2024 ప‌రీక్ష‌కు తెలంగాణ ప్రభుత్వం అంతా సిద్ధం చేసింది. అంతా సిద్ధం రేపటి టీజీ టెట్ కు కోసం. అర్హ‌త Read more

నేడు మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు..!
hydra demolition today

హైదరాబాద్‌ మాదాపూర్ ప్రాంతంలో నేడు హైడ్రా అధికారులు కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు. అనుమతులు లేకుండా నిర్మించిన భారీ భవనంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. అయ్యప్ప Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *