ttd

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై ఈఓ సమీక్ష

వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈఓ జె.శ్యామలరావు సమీక్ష నిర్వహించారు. జె.శ్యామలరావు అదనపు ఈఓ సి.హెచ్.వెంకయ్యతో కలిసి తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, సీవీఎస్ఓ శ్రీధర్, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
టీటీడీ తీసుకున్న ముఖ్య నిర్ణయాలివే..
23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్ లైన్ లో విడుదల, ⁠24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడీ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల‌‌. జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో ఒక కేంద్రంలో ఎస్ఎస్‌డీ టోకెన్లు కేటాయింపు. తిరుపతిలో ఎం.ఆర్. పల్లి, జీవకోన, రామా నాయుడు స్కూల్, రామచంద్ర పుష్కరిణీ, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనంలో టోకెన్ల కేటాయింపు.
ప్రోటోకాల్ దర్శనాలు
వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 9 నుండి 11 గంటలు వరకు స్వర్ణ రథం.
వైకుంఠ ద్వాదశి రోజున ఉదయం 5.30 నుంచి 6.30 వరకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం.
గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదు.
అన్న ప్రసాదాలు పంపిణీ
ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని కేటరింగ్ అధికారులకు ఆదేశం. టీ, కాఫీ, పాలు, ఉప్మా, చక్కెర పొంగలి, పొంగలి పంపిణీ. లడ్డూ ప్రసాదం కోసం భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ప్రతిరోజూ అందుబాటులో 3.50 లక్షల లడ్డూలు.

Advertisements
Related Posts
KA Paul : ప్రవీణ్ కుమార్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలన్న కేఏ పాల్
KA Paul ప్రవీణ్ కుమార్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలన్న కేఏ పాల్

KA Paul : ప్రవీణ్ కుమార్ మృతి కేసును సీబీఐకి అప్పగించాలన్న కేఏ పాల్ రాజమండ్రి శివార్లలో జరిగిన భయానక ప్రమాదంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి Read more

Chandrababu Naidu : ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం

Chandrababu Naidu : ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త Read more

శ్రీశైలంలోని దుకాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
వక్ఫ్ చట్టంపై సుప్రీంలో కొనసాగుతున్న వాడీ వేడి వాదనలు

2015లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.426ని సమర్థిస్తూ హైకోర్టు 2019 సెప్టెంబర్ 27న ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే Read more

Ramzan: ఆంధ్రాలో ఇఫ్తార్ విందుల్ని బహిష్కరించిన ముస్లింలు.. ఎందుకంటే?
Ramzan: ఆంధ్రాలో ఇఫ్తార్ విందుల్ని బహిష్కరించిన ముస్లింలు.. ఎందుకంటే?

పార్లమెంట్‌లో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఇప్పటికే రంజాన్ మాసంలో ముస్లింలకు ఇచ్చే ఇఫ్తార్ విందులను బహిష్కరించాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. బీహార్, ఆంధ్రప్రదేశ్ Read more

×