World Stroke Day 2024. HCAH reveals urgent need for rehabilitation and recovery centers as stroke incidence rises

వరల్డ్ స్ట్రోక్ డే 2024: స్ట్రోక్ సంఘటనలు పెరుగుతున్నందున పునరావాస మరియు పునరుద్ధరణ కేంద్రాల యొక్క అత్యవసర అవసరాన్ని వెల్లడించిన హెచ్‌సిఏహెచ్

హైదరాబాద్: ప్రపంచ స్ట్రోక్ డే 2024 న, తెలంగాణలో స్ట్రోక్ కేసుల ప్రాబల్యం పై ప్రధానంగా దృష్టి సారించింది , ఇది రక్తపోటు, మధుమేహం, ధూమపానం మరియు ప్రజలలో అవగాహన లేకపోవడం వంటి ప్రమాద కారకాలచే ఈ సమస్య మరింతగా పెరుగుతుంది. ఈ సవరించదగిన ప్రమాద కారకాలపై తగినంత నియంత్రణ లేనందున, రాష్ట్రం గణనీయమైన ప్రజారోగ్య సవాలును ఎదుర్కొంటుంది. అధిక శాతం మంది వ్యక్తులు ప్రమాదంలో వున్నారు. ఈ సంవత్సరం స్ట్రోక్ డే యొక్క నేపథ్యం , “#గ్రేటర్‌ దెన్ స్ట్రోక్ యాక్టివ్ ఛాలెంజ్”, స్ట్రోక్ నివారణ మరియు పునరావాసం(రీహాబిలిటేషన్ ) గురించి అవగాహన పెంచే క్రీడల యొక్క శక్తిని ఇది వెల్లడిస్తుంది , అన్ని వర్గాల ప్రజలను నిమగ్నం చేస్తుంది.

తెలంగాణలో, స్ట్రోక్ యొక్క ప్రాబల్యం కారణంగా గ్రామీణ మరియు పట్టణ జీవనశైలి ప్రభావితమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని సుమారుగా 90% పెద్దలు కనీసం ఒక హృదయనాళ ప్రమాద కారకాన్ని కలిగి ఉన్నారు. స్ట్రోక్ ఒక ప్రధాన ప్రజారోగ్య ఆందోళనగా ఉంది, సంబంధిత ప్రమాద కారకాలను తగ్గించడానికి మెరుగైన నాడీ సంబంధిత సేవలు మరియు ప్రజారోగ్య కార్యక్రమాలు అవసరం.

అవగాహనను మరింత పెంచడానికి మరియు సమాజంతో అనుబంధించబడటానికి , వరల్డ్ స్ట్రోక్ డే పురస్కరించుకుని వాక్‌థాన్ మరియు బైక్ ర్యాలీని హెచ్‌సిఏహెచ్ నిర్వహించింది. స్ట్రోక్‌ల ప్రభావం మరియు సకాలంలో పునరుధ్దరణ యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యత గురించి ప్రజల అవగాహన పెంచడంలో ఈ సంఘటనలు కీలకమైనవి. వాక్‌థాన్ లో సుమారుగా70మందికి పైగా పాల్గొన్నారు. సోమాజిగుడా నుండి గచ్చిబౌలి వరకు 50 మందికి పైగా బైక్‌ ర్యాలీలో చేరారు. తద్వారా సమగ్ర స్ట్రోక్ సంరక్షణ మరియు నివారణ వ్యూహాల యొక్క అత్యవసర అవసరాన్ని ఎత్తిచూపడానికి కమ్యూనిటీ సభ్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు మరియు స్ట్రోక్ బారిన పడి కోలుకున్న వారిని ఒకచోట చేర్చారు.

హెచ్‌సిఏహెచ్ ఎస్ఆర్ సిసి మరియు హెచ్‌సిఏహెచ్ జిబి ఆర్ఆర్ సి , హైదరాబాద్ మరియు చుట్టుపక్కల 200+ పడకలలో సంపూర్ణ, వ్యక్తిగతీకరించిన సంరక్షణను అందిస్తున్నాయి. వారి విధానం పక్షవాతంను తిప్పికొట్టడం, కండరాల పనితీరును పునరుద్ధరించడం మరియు మానసిక ఆరోగ్యానికి తోడ్పడటం, ప్రపంచ స్థాయి పరికరాలు మరియు ప్రత్యేకమైన “మెడిసిన్ రూల్ స్టోన్” పద్దతిని ఉపయోగించడంపై దృష్టి పెడుతుంది.

హెచ్‌సిఏహెచ్ యొక్క సీఈఓ వివేక్ శ్రీవాస్తవ్ మాట్లాడుతూ “హెచ్‌సిఏహెచ్ వద్ద మా లక్ష్యం, రోగులకు సౌకర్యవంతమైన వాతావరణంలో ప్రొఫెషనల్ కేర్ ను అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణను సమూలంగా మార్చడం. స్ట్రోక్ బారిన పడిన వారి యొక్క సంక్లిష్ట అవసరాలను మేము అర్థం చేసుకున్నాము వ్యక్తిగతీకరించిన పునరావాస ప్రణాళికలను అభివృద్ధి చేసాము. అవి వారి శారీరక విధులను పునరుద్ధరించడమే కాకుండా భావోద్వేగ శ్రేయస్సును కూడా మెరుగుపరుస్తాయి” అని అన్నారు.

హెచ్‌సిఏహెచ్ యొక్క సహ వ్యవస్థాపకుడు మరియు సిఓఓ డాక్టర్ గౌరవ్ తుక్రాల్ మాట్లాడుతూ ” మల్టీడిసిప్లినరీ నైపుణ్యం మరియు అధునాతన పునరావాస పరికరాల కలయిక ద్వారా, మేము పక్షవాతం బారిన పడిన రోగులకు రికవరీ సమయాన్ని గణనీయంగా తగ్గించగలుగుతున్నాము. రోగులు మరియు వారి కుటుంబాలతో ఒప్పందం చేసుకుని వ్యక్తిగతీకరించిన సంరక్షణ ప్రణాళికలను సృష్టించడం ద్వారా, ప్రతి స్ట్రోక్ సర్వైవర్ వారి అవసరాలకు అనుగుణంగా సంరక్షణను పొందుతున్నారని మేము నిర్ధారిస్తున్నాము. మా సమగ్రమైన విధానం లో భాగమైన కాగ్నిటివ్ థెరపీ, సెన్సరీ రిహాబ్ . రిక్రియేషన్ రిహాబ్ మరియు మరెన్నో రోగులు సాధారణ జీవితానికి తిరిగి రావటానికి తోడ్పడుతుంది మరియు మరోమారు స్ట్రోక్ రాకుండా నివారిస్తుంది” అని అన్నారు.

డాక్టర్ మానస్ కుమార్ పానిగ్రహి, హెచ్ఓడి & సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జరీ, కిమ్స్ హాస్పిటల్‌ వారు మాట్లాడుతూ “రోగులు మరియు వారి కుటుంబాలతో ఒప్పందం చేసుకుని వ్యక్తిగతీకరించిన సంరక్షణ ప్రణాళికలను సృష్టించడం ప్రతి స్ట్రోక్ సర్వైవర్, వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా చికిత్స పొందగలరని నిర్ధారిస్తుంది. మా సమగ్ర విధానంలో అభిజ్ఞా చికిత్సను ఇంద్రియ పునరుద్దరణ, రిక్రియేషనల్ థెరఫీ మరియు మరెన్నో ఉంటాయి. ఈ చికిత్సలు శారీరక పునరుద్ధరణకు మాత్రమే కాకుండా, భావోద్వేగ శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి కూడా కీలకమైనవి, వ్యక్తులు సాధారణ జీవితానికి తిరిగి రావడానికి మరియు మరోమారు స్ట్రోక్ రాకుండా నివారించడంలో సహాయపడతాయి ” అని అన్నారు.

పునరుద్ధరణ యొక్క “గోల్డెన్ పీరియడ్” ప్రాముఖ్యతను నిపుణులు నొక్కిచెప్పారు. స్ట్రోక్ వచ్చిన వెంటనే స్పందించే క్లిష్టమైన సమయం ఇది. ఈ స్పందనతో శాశ్వత వైకల్యాన్ని నివారించవచ్చు. మెరుగైన నిఘా వ్యవస్థలు, సమాజ-ఆధారిత జోక్యం మరియు స్ట్రోక్ ఎపిడెమియాలజీపై నిరంతర పరిశోధనలు వంటివి విపరీతంగా పెరుగుతున్న ఆరోగ్య భారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ విధానాలు తీసుకురావటానికి మరియు వనరుల కేటాయింపులను జేయడానికి అవసరం.

వరల్డ్ స్ట్రోక్ దినోత్సవ వేళ, స్ట్రోక్ నివారణ మరియు పునరావాసం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచాలని విధాన రూపకర్తలు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు మరియు ప్రజలను హెచ్‌సిఏహెచ్ కోరింది. కలిసికట్టుగా, అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తును మనం సృష్టించవచ్చు.

Related Posts
ఏపీ హైకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకం..
AP High Court appoints three new judges copy

అమరావతి: ఏపీ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియవితులయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులోనే న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్, చల్లా గుణరంజన్‌లను అదనపు Read more

ఏపీలో రాబోయే భవిష్యత్ అంతా వైసీపీదే : పార్టీ నేతలు
Future of AP belongs to YCP.. party leaders

అమరావతి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అధ్యక్షతన వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో వైసీపీ పార్టీ నేతలు Read more

రేవంత్ రెడ్డి ది రెండు నాల్కల ధోరణి – MLC కవిత
Mlc kavitha comments on cm revanth reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ప్రజలను ఆకట్టుకునేందుకు ఒక మాట మాట్లాడి, గెలిచిన తర్వాత Read more

సిమంధర్ ఎడ్యుకేషన్ ఏఐ చాట్‌బాట్ “డిజిటల్ శ్రీపాల్” ఆవిష్కరణ
Simandhar Education Launches AI Chatbot 'Digital Shripal'

న్యూఢిల్లీ : గ్లోబల్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ కోర్సుల ప్రదాత సిమంధర్ ఎడ్యుకేషన్, CPA, CMA, CFA, ACCA, CIA మరియు EA వంటి హై-స్టేక్స్ అకౌంటింగ్ మరియు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *