vanjangi

వంజంగి మేఘాల కొండ,కొత్తపల్లి జలపాతం వద్ద కిక్కిరిసిన పర్యాటకులు

అల్లూరి జిల్లా లో పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకులతో ఆదివారం కిటకిటలాడాయి.ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన వంజoగి మేఘాల కొండను తిలకించేందుకు పర్యాటకులు తెల్లవారు జాము నుంచే వంజoగి మేఘాల కొండకు చేరుకుని మంచు మేఘాలు..చీల్చుకుంటూ ఉదయించే సూర్య కిరణాలు దృశ్యాలను తిలకించిన పర్యాటకులు ఎంతో తన్మయం చెందుతూ వింత అనుభూతిని పొందారు.సూర్యుడు ఉదయించే సమయంలో సూర్య కిరణాలు మంచు మేఘాల నుంచి ప్రకృతి ప్రసాదించే అందమైన దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.పర్యాటకులు మంచు మేఘాలను, దీవుళ్లా తపించేలా కొండలు దర్సనం ఇవ్వడంతో పర్యాటకులు అందమైన దృశ్యాలను సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisements

వంజంగి మేఘాల కొండకు ఆదివారం కావడంతో వెలాదిగా పర్యాటకులు రావడంతో వంజoగి మేఘాల కొండ ప్రదేశం అంతా కిక్కిరిసి పోయింది.ఆ రహదారి అంతా పర్యాటకుల వాహనాలతో రద్దీగా మారింది.అలాగే మరో పర్యాటక ప్రదేశం కొత్తపల్లి జలపాతం సందర్శించడానికి వెలాదిగా పర్యాటకులు వచ్చారు.దీంతో జలపాతం అంతా పర్యాటకులతో కిక్కిరిసి పోయింది.జలపాత అందాలను తిలకిస్తూ జలపాతం వద్ద ఉన్న కొలనులో పర్యాటకులు స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేసారు.ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు.అల్లూరి జిల్లా లో ఉన్న అరకు అందాలు,జలపాతాలు,ప్రకృతి ప్రసాదించే అందాలను తిలకించడానికి వచ్చిన పర్యాటకులతో పర్యాటక ప్రదేశాలన్నీ కిక్కిరిసి పోయాయి.

Related Posts
కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్
కేసీఆర్, హరీశ్ రావు పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్

తెలంగాణలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిన వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్), Read more

అమెరికా సరిహద్దులపై వేలాది మైగ్రెంట్స్..
migrants scaled

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి అధికారంలోకి రాబోతున్న నేపథ్యంలో, భారీ సంఖ్యలో మైగ్రెంట్స్ (తాత్కాలికంగా వలస వచ్చిన వారు) అమెరికా సరిహద్దుల వద్ద చేరుకుంటున్నారు. ట్రంప్ Read more

AP: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. పలుకీలక అంశాలకు ఆమోదం
Cabinet meeting concludes.. Approval of several key issues

AP: ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్‌ ఆమోదం Read more

హైదరాబాద్ డెలివరీ సెంటర్‌తో భారతదేశంలో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తోన్న గ్లోబల్‌లాజిక్
GlobalLogic further expanding its operations in India with Hyderabad delivery center

హైదరాబాద్: హిటాచీ గ్రూప్ కంపెనీ మరియు డిజిటల్ ఇంజనీరింగ్‌లో అగ్రగామిగా ఉన్న గ్లోబల్‌లాజిక్ ఈరోజు హైదరాబాద్‌లో తమ నూతన డెలివరీ సెంటర్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆసియా పసిఫిక్ Read more

×