రేవంత్ తో భేటీకి చిరంజీవి దూరం

రేవంత్ తో టాలీవుడ్ భేటీ ఆసక్తిని పెంచుతోంది. సంధ్యా థియేటర్ ఘటనతో పాటుగా సినీ పరిశ్రమ సమస్యల పైన ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు సమావేశం జరిగే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. అయితే, అనూహ్యంగా ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉన్నారు. దీంతో, కొత్త చర్చ తెర మీదకు వచ్చింది.

చిరంజీవి గైర్హాజరు సీఎం రేవంత్ తో సమావేశానికి సర్వం సిద్దమైంది. సినీ ప్రముఖులు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. కాగా, ఈ సమావేశం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన చిరంజీవి మాత్రం రాలేదు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ హాజరయ్యారు. అల్లు అరవింద్ .. దిల్ రాజు ఈ టీం ను లీడ్ చేస్తున్నారు. అయితే, చిరంజీవి గైర్హాజరు వెనుక పలు కారణాల పైన చర్చ జరుగుతోంది.
రేవంత్ తో మెగా చర్చలు కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాత్రం తొలి నుంచి ఈ వివాదానికి దూరంగా ఉన్నారు. అయితే, ఈ సంక్రాంతికి రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సైతం విడుదల కానుంది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫట్ షోలు.. టికెట్ ధరల పెంపు పైన నిర్ణయం వెనక్కు తీసుకోకుంటే నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి. దీంతో, రేవంత్ ను ఒప్పించి.. ఆ నిర్ణయంలో సడలింపు కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ భేటీ ఏర్పాటు చేసారు. అయితే, ఈ భేటీ ఏర్పాటుకు తొలి నుంచి పూర్తి ప్రయత్నాలు చేసిన చిరంజీవి ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని తెలుస్తుంది. అయితే, రేవంత్ తో ఫోన్ లో మాట్లాడిన సమయంలోనే కీలక అంశాలను ప్రస్తావన చేసినట్లు సమాచారం.

Related Posts
నేడు గ్రూప్-2 ఫలితాలు
group2 exam

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష ఫలితాలను టీఎస్‌పీఎస్సీ (TSPSC – తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) నేడు అధికారికంగా విడుదల చేయనుంది. 783 ప్రభుత్వ Read more

కేంద్రం గుడ్‌న్యూస్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీగా నిధులు విడుదల
Central Government has released huge funds to the Telugu States

తెలుగు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం శుభవార్త తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయింపులు చేసింది. ఏపీకి 498 కోట్లు,తెలంగాణకి 516 కోట్ల నిధులు విడుదల Read more

మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ
On the third day muddapappu bathukamma

On the third day, muddapappu bathukamma హైదరాబాద్‌: తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ముచ్చటగా మూడో రోజుకు చేరుకున్నాయి. పూలను పూజించే సంస్కృతి కలిగిన తెలంగాణలో మూడో Read more

సర్కారులో చలనం వచ్చింది: కేటీఆర్‌
KTR Congress

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ట్వీట్టర్ లో మండిపడ్డారు. గురుకులాల విద్యార్థులను తమ హయాంలో ఎవరెస్ట్ ఎక్కించి రికార్డులు సృష్టించేలా చేశామని, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *