We will complete the Visakha Metro Rail project in two stages. Minister Narayana

రెండు స్టేజీలలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ మెట్రో రైల్‌పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ మాట్లాడుతూ..మెట్రో పాలసీ ప్రకారం మెట్రో రైల్ కార్పొరేషన్ కు అప్లై చేసారని… మెట్రో రైల్ టెండర్లు గత ప్రభుత్వం రద్దు చేయడం వల్ల విశాఖ మెట్రో రైలు ఆగిపోయిందని వెల్లడించారు. 76.9 కిలోమీటర్ల 4 కారిడార్ కోసం మూడేళ్ళ తరువాత గత ప్రభుత్వం డిపిఆర్ ఇచ్చిందన్నారు. కక్ష సాధింపు ధోరణితో గత ప్రభుత్వం కాలయాపన చేసిందని మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహించారు.

Advertisements

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే ప్రాజెక్టు ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు. మెట్రోరైల్ రాకుండా గ‌త ప్ర‌భుత్వం క‌క్ష‌పూరితంగా ప‌క్క‌న పెట్టేసింద‌ని మంత్రి విమ‌ర్శించారు. మెట్రో ప్రాజెక్టుపై స్వ‌యంగా కేంద్ర‌మంత్రిని క‌లిసిన‌ట్లు మంత్రి నారాయ‌ణ వెల్ల‌డించారు.

రెండు స్టేజీలలో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పూర్తి చేస్తామని కేంద్రానికి రాసామని తెలిపారు. 11,491 కోట్లతో ఈ ప్రాజెక్టు చేయడానికి నిర్ణయించామని పేర్కొన్నారు. ఎండాడ, మద్దిలపాలెం, హనుమంతవాక, స్టీల్ ప్లాంట్ ల వద్ద క్రాసింగ్ ల నిర్మాణం అన్నారు మంత్రి పొంగూరు నారాయణ. ఇక అటు రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం పై మండలిసభలో చర్చించాలని వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది.

Related Posts
TGSRTCకి రూ.21.72 కోట్ల టోకరా
5000 special buses for Sankranti festival - TGSRTC

TGSRTCకి రూ.21.72 కోట్ల టోకరా.'గో రూరల్ ఇండియా' సంస్థ పై చర్యలు.(TGSRTC)కి సంబంధించి పెద్ద స్కాం వెలుగులోకి వచ్చింది. ప్రకటనల పేరుతో 'గో రూరల్ ఇండియా' అనే Read more

వైసీపీ పై పయ్యావుల కీలక వ్యాఖ్యలు
వైసీపీ పై పయ్యావుల కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను అసెంబ్లీలో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి పయ్యావుల వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో Read more

Acer India: ఏసర్ ఇండియా..మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయం
Monthly leave for female employees at Acer India

Acer India : ప్రముఖ ఇంజినీరింగ్‌ సంస్థ ఎల్‌అండ్‌టీ బాటలోనే ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఏసర్ ఇండియా మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది. నెలసరి సమయంలో Read more

మన్మోహన్ సింగ్ స్మారక స్థలం ఎక్కడ?
మన్మోహన్ సింగ్ స్మారక స్థలం ఎక్కడ?

కేంద్రం, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకాన్ని నిర్మించడానికి సంబంధించి ప్రతిపాదిత స్థలాలను, ఎంపికలను ఆయన కుటుంబ సభ్యులకు పంపాలని సూచించింది. రాజ్‌ఘాట్, రాష్ట్రీయ స్మృతి Read more

×