లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం నాడు ‘వైట్ టీ-షర్టు ఉద్యమం’ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మోడీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. “ఎంపిక చేసిన కొంతమంది పెట్టుబడిదారులకు మాత్రమే ప్రయోజనాలిచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆర్థిక అసమానత పెరుగుతుండటంతో పేదలకు వెన్నుపోటు పొడుస్తోంది,” అని అన్నారు. రాహుల్ గాంధీ ‘వైట్ టీ-షర్టు ఉద్యమం’ ప్రారంభించి తన సహచరులు మరియు యువత పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమంలో పాల్గొనాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఆందోళనలో చేరదలచిన వారు వెబ్సైటు ద్వారా లేదా 9999812024 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చని పేర్కొన్నారు.
ఉద్యమానికి సంబంధించిన వెబ్సైట్ ప్రకారం, వైట్ టీ-షర్టు కేవలం దుస్తుల ముక్క కాదు. ఇది ఐదు ప్రధాన విలువలను సూచిస్తుంది: కరుణ, ఐక్యత, అహింస, సమానత్వం, మరియు అందరికీ పురోగతి. భారతదేశం యొక్క 8000 సంవత్సరాల పురాతన నాగరికత స్పూర్తి ఈ విలువల ద్వారా ప్రతిబింబించ బడుతుందని వెబ్సైట్ తెలిపింది. ఆదాయ అసమానత, కుల వివక్ష, మరియు మతపరమైన విభజనలను అధిగమించేందుకు ఈ ఉద్యమం ఆవశ్యకతను హైలైట్ చేస్తోంది. వైట్ టీ-షర్టు ‘న్యాయమైన మరియు ఏకీకృత భారతదేశం’ కోసం పిలుపునిస్తుంది. ఇది గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర స్ఫూర్తిని ప్రతిధ్వనిస్తుంది అని తెలిపింది. ఈ ఉద్యమ లక్ష్యాలు భారతదేశాన్ని సమన్వయం, సమానత్వం కలిగిన దేశంగా మారుస్తాయి అని పేర్కొంది.
జవహర్లాల్ నెహ్రూ యొక్క ఐకానిక్ ‘నెహ్రూ జాకెట్’ మాదిరిగా, వైట్ టీ-షర్టు ఇప్పుడు రాహుల్ గాంధీకి ప్రతీకగా మారింది. ఉద్యమానికి ఈ చిహ్నం ఎంపిక వెనుక ఇదే కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ తన 54వ పుట్టినరోజు సందర్భంగా వైట్ టీ-షర్టును పారదర్శకత, దృఢత్వం, మరియు సరళతకు సూచికగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ ప్రారంభించిన ఉద్యమం సమానత్వం, ఐక్యత, మరియు న్యాయానికి పిలుపునిస్తోంది. ఈ ఉద్యమం ద్వారా భారతీయ సమాజంలో పెరుగుతున్న అసమానతలపై చర్చను ప్రేరేపించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.