deeksha diwas on 29th

రాష్ట్ర‌ వ్యాప్తంగా 29న దీక్షా దివస్ – బిఆర్ఎస్ పిలుపు

తెలంగాణ రాష్ట్ర‌ వ్యాప్తంగా నవంబర్ 29 న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షాదివాస్ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్షా దివస్ అనేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు.

Advertisements

2009, నవంబరు 29న నిరాహార దీక్ష మొదలుపెట్టిన కేసిఆర్, డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తరువాత తన 11 రోజుల దీక్షను విరమించాడు. నవంబరు 29న కరీంనగర్ లోని ఉత్తర తెలంగాణ భవన్ నుంచి సిద్ధిపేట దగ్గర రంగధాంపల్లిలో ఏర్పాటుచేసిన దీక్షా స్థలం వద్దకి బయల్దేరిన కేసీఆర్ వాహనంను కరీంనగర్ మానేరు బ్రిడ్జ్ సమీపంలోని అలుగునూరు చౌరస్తాలో పోలీసు బలగాలు, రిజర్వ్ పోలీస్ బెటాలియన్లు చుట్టుముట్టారు. వాహనం నుంచి బలవంతంగా దించివేయబడ్డ కేసిఆర్, రోడ్డుమీదే ధర్నా చేస్తుండడంతో ఖమ్మం జైలుకు తరలించారు. ఆ జైలులోనే తన దీక్షను ప్రారంభించాడు.

కాగా తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్షా దివస్ నిలిచింది. ఈ దీక్షా యావత్ భారతదేశ రాజకీయ వ్యవస్థను కదిలించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటించేలా చేసింది. దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చింది. అందుకే నవంబర్ 29 న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షాదివాస్ ఘనంగా నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.తాను కరీంనగర్‌లో జరిగే దీక్షా దివస్‌లో పాల్గొంటానని వెల్లడించారు.

✳️ ఈనెల 29వ తేదీన కరీంనగర్‌లో జరిగే దీక్ష దివస్ కార్యక్రమంలో పాల్గొననున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS

🔹 రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

🔹 తెలంగాణ ప్రజల… pic.twitter.com/8nGzqsQ3wE— BRS Party (@BRSparty) November 21, 2024

Related Posts
Amaravathi : ఏప్రిల్ 15 తర్వాత ‘అమరావతి’ పనులు స్టార్ట్
amaravathi 600 11 1470895158 25 1477377675 27 1493286590

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 15 తర్వాత నిర్మాణాలను పునఃప్రారంభించాలని నిర్ణయించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజధాని అభివృద్ధిని Read more

నేడు పల్నాడుకు సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu's visit to tirupathi from today

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పార్టీ Read more

Donald Trump: ఉక్రెయిన్ అంశంపై ట్రంప్-పుతిన్ కీలక చర్చలు
మళ్ళీ దేశాలకు ట్రంప్ వార్నింగ్..ఈ సారి ఏ విషయంలో అంటే!

యుద్ధ ముగింపుకు ట్రంప్ ప్రయత్నాలుఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ముగించే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలు చేపట్టారు. అమెరికా కొత్త అధ్యక్ష పదవి చేపట్టే ముందే, ఉక్రెయిన్ Read more

6 నుంచి తెలంగాణలో కులగణన
kulaganana

తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 6 నుండి కులగణనను ప్రారంభించాలని నిర్ణయించడం ప్రాధాన్యత కలిగిన అంశంగా మారింది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని Read more

Advertisements
×