manmohan

‘మౌన ప్రధాని’గా మన్మోహన్ సింగ్‌

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవిలో కొనసాగినంత కాలం ‘మౌనముని’, ‘మౌన ప్రధాని’ అంటూ మీడియా, ప్రతిపక్షాలు అనేవి. దేశ ఆర్థిక వ్యవస్థ సంస్కర్తగా ఆయనకు పేరు వుంది. వరుసగా రెండు పర్యాయాలు ప్రధానిగా చిరస్మరణీయ సేవలు అందించారు. అయితే, ఆయన పదవిలో కొనసాగినంత కాలం ‘మౌనముని’, ‘మౌన ప్రధాని’ అంటూ ప్రతిపక్షాలు విమర్శించేవి.

Advertisements

ఈ తరహా వ్యాఖ్యలను పట్టించుకోకుండా దేశాభివృద్ధిలో ఆయన తనదైన బలమైన ముద్ర వేశారు. ప్రధానిగా మొదటి పర్యాయంలోనే ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. పదవి నుంచి దిగిపోయిన నాలుగేళ్ల తర్వాత 2018లో తొలిసారి మౌనముని విమర్శలపై స్పందించారు. ఆరు సంపుటాలుగా ఆయన రచించిన ‘ఛేంజింగ్ ఇండియా’ పుస్తకావిష్కరణలో మాట్లాడారు.
నేను మౌనిని కాను, మీడియాతో మాట్లాడాను
‘‘నన్ను మౌన ప్రధాని అన్నారు. వాస్తవాలు ఏమిటో ఈ పుస్తకాలు తెలియజేస్తాయని భావిస్తున్నాను. ప్రెస్‌తో మాట్లాడటానికి భయపడిన ప్రధానమంత్రిని కాదు. నేను క్రమం తప్పకుండా మీడియాతో మాట్లాడాను. నేను చేపట్టిన ప్రతి విదేశీ పర్యటన సమయంలో మీడియాతో మాట్లాడాను.

విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత పెద్ద సంఖ్యలో ప్రెస్ కాన్ఫరెన్స్‌‌లలో పాల్గొన్నాను. వాటి ఫలితాలను కూడా పుస్తకంలో వివరించాను’’ అని మన్మోహన్ సింగ్ గట్టి సమాధానం ఇచ్చారు.

1991లో ఆర్థిక సంస్కరణల ద్వారా ప్రపంచ మార్కెట్‌లో భారత ఆర్థిక వ్యవస్థను ఒక భాగంగా మార్చివేశారు. దీంతో దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి వృద్ధిబాట పట్టింది.
ప్రజల సందర్శనార్థం
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం ఆయన కన్నుమూశారు. ఆయన పార్థివదేహాన్ని ప్రస్తుతం మోతీలాల్ నెహ్రూ మార్గ్ లోని నివాసం వద్ద ఉంచారు. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అనంతరంశనివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నట్టు సమాచారం.

Related Posts
నేడు మహారాష్ట్రలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం..కాబోయే సీఎం ఎవరు?
Today the new government will be formed in Maharashtra. Who will be the future CM

ముంబయి : మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు సీఎం పీఠం ఎవరు అధిరోహిస్తారో అని అందరూ ఆసక్తిగా Read more

Amit Shah: ఉగ్రవాదుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ
Amit Shah: ఉగ్రవాదుల పై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ

పహల్గాంలో ఉగ్రదాడిపై కాంగ్రెస్ కండనం జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో అమాయక పర్యాటకులపై జరిగిన దారుణ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని రేపింది. ఈ ఘటనపై దేశ రాజకీయ Read more

బస్సును ఢీకొట్టిన వ్యాన్‌.. 9 మంది మృతి
bus accident

మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఆగి ఉన్న బస్సును మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఆ వాహనంలోని 9 మంది ఈ ప్రమాదంలో మరణించారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు Read more

మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ, రాహుల్ స్పందన
Political leaders condolenc

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం విశిష్ట నేతను కోల్పోయిందని, ఆయన సేవలను Read more

Advertisements
×