దేశ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మభూషణ్ పురస్కారాన్ని తెలుగు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరియు తమిళ సినీ స్టార్ అజిత్ కుమార్ ఈ పురస్కారం అందుకోవడం సినీ, రాజకీయ ప్రపంచాన్ని గర్వపడేలా చేసింది. సోమవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు ప్రముఖ నటులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ బాలకృష్ణపై స్పందిస్తూ:
హిందూపురం ఎమ్మెల్యే, ప్రఖ్యాత సినీనటుడు నందమూరి బాలకృష్ణ గారు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఆయన పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రల్లో చూపిన అభినయ శైలి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగానికే కాదు, ప్రజాసేవా రంగానికీ తనదైన ముద్ర వేశారు. కలాసేవతో పాటు ప్రజాసేవలో మరిన్ని మైలురాళ్లు అధిగమించాలని కోరుతున్నాను అని పేర్కొన్నారు.
అజిత్ కుమార్పై పవన్ కళ్యాణ్ అభిప్రాయం:
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ గారు సున్నితమైన ప్రేమకథల నుంచీ, థ్రిల్లర్ మరియు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన వైవిధ్యభరితమైన సినిమాల వరకు తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించగలిగారు.
అభినయంలోనే కాదు, స్టైల్ పరంగా కూడా ఆయనకు తానూ ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన స్టార్. అంతేకాకుండా ఒక ప్రొఫెషనల్ రేసర్గానూ గుర్తింపు పొందారు. ఇటువంటి ప్రతిభాశాలి మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.

Read also: Mohanlal: ‘తుడరుమ్’ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్