IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన వైభవ్‌ సూర్యవంశీ

ఐపీఎల్‌లో భాగంగా, వైభవ్‌ సూర్యవంశీ (38 బంతుల్లో 101, 7 ఫోర్లు, 11 సిక్సర్లు) ఐపీఎల్‌-18లో పాత రికార్డుల దుమ్ముదులిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 14 ఏండ్లకే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ఈ బీహార్‌ చిచ్చరపిడుగు, జైపూర్‌లో సృష్టించిన పరుగుల సునామీకి 2025 సీజన్‌లో వరుస ఓటముల తర్వాత రాజస్థాన్‌ రాయల్స్‌ గెలుపు బాట పట్టింది. వైభవ్‌ విధ్వంసక శతకానికి తోడు యశస్వి జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్థశతకంతో రెచ్చిపోగా గుజరాత్‌ టైటాన్స్‌ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 15.5 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 రన్స్‌ చేసింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84, 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో 50 నాటౌట్‌, 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు.

Advertisements

తొలి మ్యాచ్‌

ఇటీవలే 18 ఏండ్లు నిండిన ఐపీఎల్‌ కంటే తక్కువ వయసున్న వైభవ్‌ జైపూర్‌లో టైటాన్స్‌ బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డాడు. సిరాజ్‌, ఇషాంత్‌ శర్మ, వాషింగ్టన్‌, రషీద్‌ ఖాన్‌ వంటి బౌలర్లను క్లబ్‌స్థాయి బౌలర్లుగా మార్చేసి జైపూర్‌లో పరుగుల సునామీని సృష్టించాడు. మ్యాచ్‌లో వైభవ్‌ 101 పరుగులు చేస్తే అందులో సిక్సర్లు, బౌండరీల రూపంలోనే ఏకంగా 94 పరుగులు వచ్చాయంటే బంతిని అతడు ఎంత కసిగా బాదాడో అర్థం చేసుకోవచ్చు. సిరాజ్‌ తొలి ఓవర్లో తాను ఎదుర్కున్న రెండో బంతిని లాంగాన్‌ మీదుగా సిక్సర్‌గా మలిచిన వైభవ్‌ ఇషాంత్‌ శర్మ వేసిన 4వ ఓవర్లో 6, 6, 4, 6, 4తో ఏకంగా 28 పరుగులు చేసాడు. వాషింగ్టన్‌ ఐదో ఓవర్లో రెండు భారీ సిక్స్‌లు, ఓ బౌండరీతో 17 బంతుల్లోనే ఐపీఎల్‌లో అతడు తొలి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. వైభవ్‌, జైస్వాల్‌ జోరుతో పవర్‌ ప్లేలోనే రాయల్స్‌ 87/0గా నిలిచింది. ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అఫ్గాన్‌ బౌలర్‌ కరీమ్‌ జన్నత్‌ ఓవర్లో అయితే బాదుడును వైభవ్‌ మరోస్థాయికి తీసుకెళ్లాడు. ఆ ఓవర్లో 6, 4, 6, 4, 4, 6తో ఏకంగా 30 రన్స్‌ రాబట్టి 90లలోకి వచ్చాడు. రషీద్‌ 11వ ఓవర్లో రెండో బంతిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌తో 35 బంతుల్లోనే అతడి తొలి శతకం పూర్తయింది. సెంచరీ తర్వాత వైభవ్‌, ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయినా జైస్వాల్‌ సారథి రియాన్‌ పరాగ్‌ (32*) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు. ప్రసిద్ధ్‌ కృష్ణ, రషీద్‌ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

 IPL 2025: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన  వైభవ్‌ సూర్యవంశీ

శతకం

 ఓపెనింగ్‌ ద్వయం సుదర్శన్‌ (39), గిల్‌ తొలి వికెట్‌కు 10 ఓవర్లలోనే 93 పరుగులు జోడించి టైటాన్స్‌కు శుభారంభం అందించారు. పవర్‌ ప్లేలో ఈ ఇద్దరూ ఓవర్‌కు రెండు బౌండరీలకు తగ్గకుండా ఆడటంతో 6 ఓవర్లకు గుజరాత్‌ వికెట్‌ నష్టపోకుండా 53 పరుగులు చేసింది. భారీ మెరుపులేమీ లేకపోయినా ఈ జోడీ నిలకడగా రన్స్‌ రాబట్టింది. హసరంగ పదో ఓవర్లో స్వీప్‌ షాట్‌తో 29 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. రెండో స్పెల్‌లో బంతినందుకున్న తీక్షణ 11వ ఓవర్లో రెండో బంతికి సుదర్శన్‌ పరాగ్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. బట్లర్‌ రాకతో గుజరాత్‌ ఇన్నింగ్స్‌కు ఊపొచ్చింది. ఫిఫ్టీ తర్వాత గిల్‌ యుధ్వీర్‌ 14వ ఓవర్లో రెండు సిక్సర్లు దంచగా హసరంగ ఓవర్లో బట్లర్‌ 6, 6, 4, 6 బాది 24 పరుగులు పిండుకున్నాడు. శతకం వైపునకు సాగుతున్న గిల్‌ను తీక్షణ 17వ ఓవర్లో పెవిలియన్‌కు పంపాడు. గిల్‌ నిష్క్రమించినా ఆఖర్లో బట్లర్‌ దూకుడుతో ఆ జట్టు భారీ స్కోరు సాధించింది.

Read Also: IPL 2025 : వైభవ్ సూర్యవంశీ సూపర్ సెంచరీ

Related Posts
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
RBI Governor Shaktikanta Das is ill.admitted to hospital

చెన్నై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అస్వస్థతకు గురయ్యారు. ఎసిడిటీ కారణంగా ఆయన చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఈ Read more

లాబుషేన్ కు రికీ పాంటింగ్ వార్నింగ్!.
marnus labuschagne

మార్నస్ లాబుషేన్ ప్రస్తుతం కొంత ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది, అతను తన ఫామ్‌ను తిరిగి సంపాదించడానికి కష్టపడుతుండగా, రికీ పాంటింగ్ అతని ఆటను మెరుగుపరచాలని సూచించాడు. డిసెంబర్ Read more

న్యూజిలాండ్ పై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూజిలాండ్ పై రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ మరియు న్యూజిలాండ్ మధ్య ఉత్కంఠ భరితమైన పోరు జరగనుంది. ఈ హై-వోల్టేజ్ Read more

Andhra Pradesh: ఆంధ్రాలో ఆర్మీ కుటుంబాలకు ఆస్తిపన్ను మినహాయింపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Andhra Pradesh: ఆంధ్రాలో ఆర్మీ కుటుంబాలకు ఆస్తిపన్ను మినహాయింపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఏపీ ప్రభుత్వం సరిహద్దులో దేశం కోసం పోరాడుతున్న సైనికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పంచాయతీల్లో దేశ రక్షణ సిబ్బంది ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×