cng

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు..కాంగ్రెస్‌కు ఈసీ ఆహ్వానం

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేస్తున విషయం తెలిసిందే. ఈక్రమంలోనే కాంగ్రెస్‌ రాసిన లేఖకు ఎన్నికల సంఘం స్పందించింది. అనుమానాల నివృత్తి కోసం డిసెంబర్ 3న రావాలని కాంగ్రెస్‌ ప్రతినిధి బృందాన్ని ఎలక్షన్ కమిషన్​ (ఈసీ) ఆహ్వానించింది. ఎన్నికలు ప్రతిదశలోనూ పారదర్శకంగా జరిగాయని తెలిపింది. చట్టపరమైన ఆందోళనలను, అనుమానాలను పరిశీలించనున్నట్లు వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం అనుమానాలు విన్న తర్వాత రాతపూర్వక సమాధానం ఇస్తాం అంటూ కాంగ్రెస్​ పార్టీ బృందాన్ని ఈసీ ఆహ్వానించింది.

కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే సహా అగ్ర నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం ఈసీకి లేఖ రాశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారంటూ పోలింగ్‌ డేటాలోనూ తేడాలున్నాయని లేఖలో ప్రస్తావించారు. వ్యక్తిగతంగా హాజరై తమ అనుమానాలు తెలియజేస్తామని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్‌ రాసిన లేఖపై ఈసీ తాజాగా స్పందించింది.

ఇటీవలే వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విపక్ష మహా వికాస్‌ అఘాడీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. కూటమిలోని బీజేపీకి 132, షిండే సేనకు 57, అజిత్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 సీట్లు దక్కాయి. విపక్ష కూటమిలోని కాంగ్రెస్‌కు 16, శివసేన (యూబీటీ) 20, ఎన్సీపీ (ఎస్‌పీ) 10 స్థానాల్లో మాత్రమే గెలుపొందాయి.

Related Posts
వాలంటీర్లు ఉద్యోగాల్లోనే లేరు – లోకేశ్
nara lokesh

వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లపై ఎదురైన ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. "పుట్టని పిల్లలకు పేరెలా పెడతారని" Read more

జర్నలిస్టు హత్య కేసు: హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు
జర్నలిస్టు హత్య కేసు: హైదరాబాద్‌లో నిందితుడి అరెస్టు

గత వారం ఛత్తీస్‌గఢ్‌లోని సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం లభించిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ హత్యకు సంబంధించి దర్యాప్తు చేస్తూ, ఈ హత్యకు కుట్ర పన్నిన ప్రధాన నిందితుడిని Read more

ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
Massive drug bust at Mumbai airport

ముంబయి: కస్టమ్స్ అధికారులు ముంబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్, బంగారం, వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల జరిగిన దాడుల్లో 16.49 కోట్ల విలువైన 1700 గ్రాముల Read more

ఏపీ రాజధాని పనులు పునఃప్రారంభించిన సీఎం చంద్రబాబు
CM Chandrababu restarted AP capital works

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం మళ్లీ మొదలైంది. తుళ్లూరు మండలం.. రాయపూడి దగ్గర రాజధాని నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునః ప్రారంభించారు. అక్కడి రాజధాని Read more