हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

మల్బరీ పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు.

pragathi doma
మల్బరీ పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే లాభాలు.

మల్బరీ పండ్లు కేవలం రుచికరంగా ఉండడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి మనకు బాగా ఉపయోగపడే ఎన్నో పోషకాలతో నిండిపోయిన పండ్లు. ఇవి తెల్ల, ఎరుపు, నలుపు రంగుల్లో ఉంటాయి. ఈ పండ్లను నేరుగా తినడమేకాకుండా జ్యూస్, జామ్, చెసే వంటలలో కూడా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు ఉండటంతో ఇవి డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిది.

మల్బరీ పండ్లలో విటమిన్ సి, విటమిన్ కే, ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా రైబోఫ్లావిన్, ఫోలేట్, డైటరీ ఫైబర్ ఉంటాయి. మల్బరీ పండ్లు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉండటంతో ఇవి శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడతాయి.

మల్బరీ పండ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. వీటిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని అరికడతాయి. ఇలా చేయడం వల్ల రక్తంలో కోలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె సంబంధిత సమస్యలు తగ్గి, గుండెపోటు, స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఈ పండ్లు బిపిని నియంత్రించడంలో కూడా బాగా సహాయపడతాయి. అందువల్ల వీటిని డైట్‌లో చేర్చడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

మల్బరీ పండ్లు రక్తాన్ని శుభ్రం చేసేందుకు, శరీరంలోని టాక్సిన్లను తొలగించేందుకు బాగా ఉపయోగపడతాయి. రక్తంలో ఉన్న నాణ్యతను మెరుగుపరచడం ద్వారా శరీరంలో ఆరోగ్యకరమైన చర్మాన్ని కలిగిస్తుంది. ఈ పండ్లను తినడం వల్ల చర్మం మెరుస్తూ ఉండటమే కాకుండా పింపుల్స్, ఎక్జిమా వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిలో ఉండే విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

మల్బరీ పండ్లలో ఉన్న ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థకు చాలా మంచిది. ఫైబర్ శరీరానికి అవసరమైన జీర్ణం ప్రక్రియను మెరుగుపరుస్తుంది. ఈ పండ్లు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియను సజావుగా నడిపించడంలో ఈ పండ్లు సహాయపడతాయి. అందువల్ల, ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు ఈ పండ్లు దోహదపడతాయి.

మల్బరీ పండ్లలో ఉండే విటమిన్ కె, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఎముకలకు బలాన్నిస్తుంది. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతాయి. తద్వారా వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల సమస్యలు, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. కాల్షియం అధికంగా ఉండటం వలన ఎముకల బలాన్ని పెంచడంలో వీటి పాత్ర ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మల్బరీ పండ్లు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధం చేసేందుకు సహాయపడతాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఈ పండ్లను నియమితంగా తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు ఈ పండ్లను తినడం వల్ల అధిక చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

ఇవి శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే ఫైబర్ ఎక్కువకాలం పాటు తృప్తిని కలిగిస్తుంది, దాంతో అధిక భోజనం చేయకూడదు. అలాగే, ఇవి లో కేలరీల పండ్లు కావడం వల్ల బరువు పెరగకుండా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఈ పండ్లను డైట్‌లో చేర్చడం వలన శరీర బరువు నియంత్రణలో ఉండేందుకు సహాయపడుతుంది.

మల్బరీ పండ్లు కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఇవి విటమిన్ ఎను కలిగి ఉంటాయి. దీని వలన కంటిచూపు మెరుగవుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ పండ్లను తినడం చాలా మంచిది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870