babuchandra1731422025

మన పోలవరం గ్రేట్: చంద్రబాబు

పీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన అనంతరం అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ కంటే పోలవరం మెరుగైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం 2014-19 మధ్య రాత్రింబవళ్లు శ్రమించామని తెలిపారు. ఒకేసారి 32 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి వరల్డ్ రికార్డు సృష్టించామని చంద్రబాబు వెల్లడించారు.
వైసీపీ ప్రాజెక్టును నాశనం చేసారు
కాగా వైసీపీ అధికారంలోకి వచ్చాక కాంట్రాక్టర్ ను మార్చేసి, ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. రివర్స్ టెండరింగ్ తో పోలవరం డ్యామ్ ను గోదాట్లో కలిపేశారని మండిపడ్డారు. గతంలో తాము డయాఫ్రం వాల్ ను 414 రోజుల్లో పూర్తి చేశామని అన్నారు. జర్మనీకి చెందిన బాయర్ సంస్థ డయాఫ్రం వాల్ నిర్మించిందని వివరించారు. 2014-19 మధ్య 72 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. ప్రాజెక్ట్ నిధులను కూడా ఇతర పనులకు వాడారని, రైతులకు వైసీపీ మోసం చేసింది అని బాబు అన్నారు.
పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్ల వంటివని చంద్రబాబు అభివర్ణించారు. పోలవరం పూర్తయితే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 7 లక్షల ఎకరాలతో కొత్త ఆయకట్టు వస్తుందని తెలిపారు. 23 లక్షల ఎకరాల భూమి స్థిరీకరణ చెందుతుందని పేర్కొన్నారు. పోలవరం ద్వారా విశాఖ పారిశ్రామిక అవసరాలు కూడా తీరతాయని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పనులు యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని చంద్రబాబు చెప్పారు,

Advertisements
Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
ఏపీ మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్

ఫిబ్రవరి 27న పోలింగ్ ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగబోయే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ రణంగట్టిన ఉత్కంఠను పెంచాయి. Read more

పంచాయతీ రాజ్ శాఖ ఈ మైలురాళ్లు దాటింది – పవన్
pawan tirupathi

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే పాలన ప్రారంభమైన తర్వాత పంచాయతీ రాజ్ శాఖ పలు కీలక మైలురాళ్లు దాటిందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా Read more

జగన్‌కు Z+ భద్రత ఎందుకు? లోకేష్ సంచలన వ్యాఖ్యలు – అసెంబ్లీలో హాట్ డిబేట్!
జగన్‌కు Z+ భద్రత ఎందుకు? లోకేష్ ప్రశ్నలు

ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు! జగన్ భద్రతపై సంచలన ఆరోపణలు ప్రతిపక్ష హోదాపై అసెంబ్లీలో నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం Read more

మూడ‌వ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర ఆమోదం
ashwini vaishnaw

ఇటీవల కాలంలో శ్రీహ‌రికోటలో చారిత్మాక ప్రయోగాలు జరుగుతూ ప్రపంచ పటంలో నిలిచింది. దీనితో భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగ కేంద్రానికి ప్రాధ్యానత పెరిగింది. శ్రీహ‌రికోటలో మూడ‌వ లాంచ్‌ప్యాడ్‌ను నిర్మించేందుకు Read more

       
×