vishnu rajoria

బ్రాహ్మణ జంటలకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం వినూత్న ఆఫర్

యువ బ్రాహ్మణ దంపతులకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ బోర్డు వినూత్న ఆఫర్ ఇచ్చింది. బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే రూ.లక్ష బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన పరుశురామ్‌ కళ్యాణ్‌ బోర్డు అధ్యక్షుడు పండిట్‌ విష్ణు రజోరియా ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర క్యాబినెట్‌ హోదాలో ఉన్న ఆయన ఇలాంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో జరిగిన బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమంలో రజోరియా మాట్లాడుతూ.. దేశంలో నాస్తికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నదని అన్నారు. మనం కుటుంబాలపై దృష్టి సారించకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. ‘నాకు యువత మీద చాలా ఆశలు ఉన్నాయి. వయసుపైడిన వారిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేం. జాగ్రత్తగా వినండి. భవిష్యత్‌ తరాన్ని రక్షించాల్సిన బాధ్యత మీపైనే ఉంది. యువత జీవితంలో సెటిలై ఒక సంతానంతో సరిపెట్టుకుంటున్నారు. ఇది పెద్ద సమస్య అయిపోయింది. ప్రతి జంట నలుగురు పిల్లలను కనాలని నేను మిమ్ములను కోరుతున్నా’ అని రజోరియా సూచించారు.

నలుగురు పిల్లలను కంటే ఆ బ్రాహ్మణ జంటకు పరుశురామ్‌ కళ్యాణ్‌ బోర్డు రూ.లక్ష బహుమతి ఇస్తుందని రజోరియా చెప్పారు. బోర్డు అధ్యక్షుడిగా తాను ఉన్నా లేకున్నా ఈ నగదు పురస్కారం ఇవ్వబడుతుందని అన్నారు.

అనంతరం రజోరియా ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఈ ప్రకటన పూర్తిగా తన వ్యక్తిగతమని, ఈ ప్రకటనతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. బ్రాహ్మణ కులానికి సంబంధించిన కార్యక్రమంలో తాను ఈ ప్రకటన చేశానని చెప్పారు. పిల్లలను చదివించడం, ఉన్నత స్థానాలకు చేర్చడం బ్రాహ్మణ సమాజానికి పెద్ద కష్టమేమీ కాదని అన్నారు.

Related Posts
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Fatal road accident. Six killed

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే మరో వ్యక్తికి Read more

న‌క్స‌ల్స్ ర‌హిత భార‌త్ కు కృషి : అమిత్ షా
Amit Shah

న‌క్స‌లిజానికి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింద‌ని, భ‌ద్ర‌తా ద‌ళాలు గొప్ప విజ‌యాన్ని న‌మోదు చేశాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న‌క్స‌లిజం కొనఊపిరితో ఉన్న‌ట్లు చెప్పారు. Read more

భారత్‌లో ఫర్టిలిటీ రేటు 6.2 నుంచి 2 కిందకు: 2050లో 1.3కి పడిపోవడం?
Predicted trend curves of birth rate death rate and natural growth rate

1950లో భారత్‌లో ప్రతి మహిళకు గరిష్టంగా 6.2 పిల్లలు పుట్టుతున్నారని గుర్తించబడింది. కానీ ఆ తరువాత సకాలంలో, ఈ ఫర్టిలిటీ రేటు తగ్గి 2 కన్నా తక్కువగా Read more

విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై కేంద్రం ప్రకటన
vizagsteel

కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై నేడు అధికారికంగా ప్రకటన చేసింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. విశాఖ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *