हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

Vanipushpa
బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు

ఇటీవల కాలంలో క్షణంలో డబ్బు సైబర్‌ నేరాల చేతిలోకి పోతున్నాయి. మన అమాయకత్వాని ఆసరా చేసుకుని సైబర్‌ నేరాల అరాచకాలు మితిమీరిపోతున్నాయి. డబ్బు పోగొట్టుకున్నా బాధితులకు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. కస్టమర్‌ కేర్‌ మోసాలు.. మాల్‌వేర్‌తో ఖాతాలను ఖాళీ చేసే సైబర్‌ నేరాల విషయంలో బాధితులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అనుమతి లేని/మోసపూరిత ఆన్‌లైన్‌ లావాదేవీల కారణంగా తమ ప్రమేయం లేకుండానే ఖాతాలోని డబ్బు పోగొట్టుకున్న బాధితులు మూడ్రోజుల్లో ఫిర్యాదు చేస్తే.. బ్యాంకులు పరిహారం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది.

అయితే.. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు(ఆర్‌బీఐ) 2017 జూలై 6న ఇచ్చిన సర్క్యులర్‌లో పేర్కొన్నట్లుగా బాధితులు మూడ్రోజుల్లో ఫిర్యాదు చేస్తే.. థర్డ్‌పార్టీ యాప్‌, వ్యక్తుల ద్వారా జరిగే మోసాల విషయంలోనూ బాధితులకు ఊరట కలిగించాల్సిన బాధ్యత బ్యాంకులదేనని స్పష్టం చేసింది.

గువాహటికి చెందిన పల్లభ్‌ భౌమిక్‌ అనే బాధితుడి విషయంలో జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌ల ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. బాధితుడు 2021లో ప్రపంచ దిగ్గజ గార్మెంట్స్‌ సంస్థ లూయీఫిలిప్‌ నుంచి రూ.4 వేలు వెచ్చించి, ఓ బ్లేజర్‌ కొనుగోలు చేశారు. ఆ తర్వాత.. దాన్ని వాపస్‌ చేస్తానంటూ లూయీఫిలిప్‌ వెబ్‌సైట్‌లో కస్టమర్‌ కేర్‌కు సమాచారం ఇచ్చారు. తనకు రూ.4 వేలను వెనక్కి ఇవ్వాలని కోరారు.

అయితే.. 2021లో లూయీఫిలిప్‌ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌కు గురై.. ఆ సైట్‌ నియంత్ర హ్యాకర్ల చేతికి వెళ్లిపోయింది. వెబ్‌సైట్‌లో కస్టమర్‌కేర్‌ను సంప్రదించినట్లు బాధితుడు భావించినా.. దీన్ని సైబర్‌ నేరగాళ్లు అవకాశంగా మలచుకుని, లూయీఫిలిప్‌ మేనేజర్‌ పేరుతో ఫోన్‌ చేశారు. ‘‘తప్పకుండా మీ సొమ్మును తిరిగి ఇస్తాం.


అయితే.. మీరు మేము పంపే లింకు ద్వారా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి’’ అని సూచించారు. బాధితుడు ఆ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయగానే.. అతని ఎస్‌బీఐ ఖాతాలో ఉన్న రూ.94,204.80 గూగుల్‌పే ద్వారా సైబర్‌ నేరగాళ్ల ఖాతాకు బదిలీ అయ్యింది. తన ఖాతా ఖాళీ అవ్వడంతో బాధితుడు ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి, జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. అయితే గూగుల్‌పే ద్వారా లావాదేవీలు జరిగినందున తాము బాధ్యులం కాదని కస్టమర్‌కేర్‌ సిబ్బంది సమాధానమిచ్చారు.

దాంతో బాధితుడు గువాహటి పోలీసులు, అసోం సీఐడీ సైబర్‌ క్రైమ్‌ సెల్‌, జాతీయ సైబర్‌ నేరాల నమోదు పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించినా.. న్యాయం జరగకపోవడంతో గువాహటి హైకోర్టును ఆశ్రయించారు. ఈలోగా నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. నేరం జరిగిన 24 గంటల్లోనే బాధితుడు ఫిర్యాదు చేశారని, ఎస్‌బీఐదే లోపమని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. అతను కోల్పోయిన రూ.94,204.80ని తిరిగి ఇచ్చేయాలని తీర్పునిచ్చింది. అయితే.. బాధితుడి పక్షానే న్యాయం ఉండడంతో.. ఎస్‌బీఐ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది.

తాజాగా ఈ కేసును విచారించిన జస్టిస్‌ జేబీ పార్దివాలా నేతృత్వంలోని ధర్మాసనం ఎస్‌బీఐనే తప్పుబట్టింది. బాధితుడి ప్రమేయం లేకుండానే ఆయన ఖాతాలోని సొమ్ము బదిలీ అయ్యింది. కాబట్టి.. ఎస్‌బీఐ అతనికి పరిహారంగా మొత్తం సొమ్మును తిరిగి ఇవ్వాల్సిందే’’ అని తీర్పునిచ్చింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

ప్రియురాలి కోసం లీవ్.. ఫిదా అయినా మేనేజర్!

ప్రియురాలి కోసం లీవ్.. ఫిదా అయినా మేనేజర్!

ఆధార్ కొత్త నియమాలు తెలుసా

ఆధార్ కొత్త నియమాలు తెలుసా

📢 For Advertisement Booking: 98481 12870