manchu manoj

పోలీసుల సూచనలతో వెనుతిరిగిన మంచు మనోజ్‌

మోహన్‌బాబు, మంచు మనోజ్‌ల మధ్య రోజుకో మలుపు తిరుగుతూ జరుగుతున్న గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. నిన్న తిరుపతిలోని మోహన్‌బాబుకు చెందిన వర్సిటీకి మంచు మనోజ్‌ రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. చివరకు పోలీసులు జరిపిన చర్చలతో మంచు మనోజ్‌ తన తాత, నాయనమ్మ సమాధుల వద్ద నివాళి అర్పించి వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దు మణిగింది. అయితే తనపై, తన భార్య మౌనికపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడులకు పాల్పడ్డారంటూ చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో మంచు మనోజ్‌ గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మనోజ్‌కు పోలీసులు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు.

Advertisements

అనంతరం ఆయన పోలీసు స్టేషన్‌ ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఎవరితో గొడవ పెట్టడానికి రాలేదని, సంక్రాంతి పండుగను కూతురుతో కలిసి జరుపుకుందామని వచ్చానని తెలిపారు. అయితే రెండు రోజుల పాటు తనను పండుగను జరుపుకోకుండా ఆటంకాలు సృష్టించారని మీడియాకు వివరించారు.తాను తిరుపతికి వస్తున్న సందర్భంగా తన అభిమానులు ఏర్పాటుచేసిన బ్యానర్లను చించివేయడం, అభిమానులను బెదిరించడం సరికాదని అన్నారు. ఫ్యాన్స్‌ను బెదిరించకుండా ఉంటే సైలెంట్‌గా ఉండేవాడినని తెలిపారు. తన కుటుంబ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుతో గాని, మంత్రి నారా లోకేష్‌, ఎమ్మెల్యే నానికి వివరించ లేదని, సహాయం చేయాలని కూడా ఎవరినీ అడగలేదని వెల్లడించారు.

Related Posts
Pawan Kalyan : చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరం: పవన్ కల్యాణ్
Chandrababu experience is necessary for the state.. Pawan Kalyan

Pawan Kalyan : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల గ్రామంలో రైతు రాజన్న పొలంలో ఫామ్ పాండ్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ Read more

ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల దరఖాస్తు గడువు పెంపు
Extension of application de

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును పొడిగించారు. ఈ నెల 16వ తేదీ వరకు గడువు పెంచినట్టు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ Read more

Lokesh: మంత్రి లోకేష్‌ను కలిసి 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్
11 year old Akhil meets Minister Lokesh

Lokesh: ఏపీ కి చెందిన 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆకెళ్ల టెక్నాలజీ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు(శుక్రవారం) విద్య, ఐటీ Read more

పోలీసుల విచారణకు హాజరైన రాంగోపాల్‌ వర్మ..
Ram Gopal Varma attended the police investigation

ఒంగోలు : ఫొటోల మార్ఫింగ్ కేసులో ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ పోలీసుల విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ మేరకు ఆయన్ను ఒంగోలు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సీఐ శ్రీకాంత్‌బాబు Read more

×