ఆంధ్రప్రదేశ్ లో పేర్ని నాని భార్యకు సంబంధించి కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. తాజాగా రేషబ్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహరంలో తొలుత 185 మెట్రిక్ టన్నులకు డబుల్ పెనాల్టీగా పేర్ని నాని రూ. 1.79 కోట్ల చెల్లించారు.
అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ అనంతరం 378 మెట్రిక్ టన్నులకు షార్టేజ్ పెరిగింది. దీంతో ఈ షార్టేజ్కు సైతం పైన్ చెల్లించాలని పేర్ని జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ.. సోమవారం నోటీసులు జారీ చేశారు.
అదనంగా రూ. 1.67 కోట్లు
రేషబ్ బియ్యం మాయం వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహరంలో తొలుత 185 మెట్రిక్ టన్నులకు డబుల్ పెనాల్టీగా పేర్ని నాని రూ. 1.79 కోట్ల చెల్లించారు. అయితే ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ అనంతరం 378 మెట్రిక్ టన్నులకు షార్టేజ్ పెరిగింది. దీంతో ఈ షార్టేజ్కు సైతం పైన్ చెల్లించాలని పేర్ని జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ.. సోమవారం నోటీసులు జారీ చేశారు. ఆ క్రమంలో అదనంగా రూ. 1.67 కోట్లు చెల్లించాలని జేసీ నోటీసుల్లో స్పష్టం చేశారు.
జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు
ఈ నేపథ్యంలో అదనంగా మరో రూ. 1.67 కోట్లు చెల్లించాలంటూ పేర్ని జయసుధకు జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. అదీకాక ముందస్తు బెయిల్ కోసం జయసుధ పెట్టుకున్న పిటిషన్పై జిల్లా కోర్టులో ఇప్పటికే వాదనలు పూర్తయ్యాయి. తీర్పును రిజర్వు చేసి ఉంచారు. ఈ తీర్పును డిసెంబర్ 31న వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించిన సంగతి తెలిసిందే.