పుష్ప 2 విడుదలై 40 రోజులు గడిచినా, థియేటర్లలో ప్రేక్షకులను ఆకర్షించేందుకు నిర్మాతలు కొత్త ప్లాన్తో ముందుకు వెళ్లుతున్నారు. ఇప్పటికే 3 గంటలు 21 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాకు మరో 20 నిమిషాలు జోడించి ‘రీ లోడెడ్ వర్షన్’గా జనవరి 17న విడుదల చేయనున్నారు. పుష్ప 2 ఫుల్ రన్ పూర్తయినా, థియేటర్లకు ప్రేక్షకులు రావచ్చా అని అనుకునే వారికి నిర్మాతలు ఇచ్చే సమాధానం ఇదే. ఈ కొత్త వెర్షన్తో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ సినిమా ఆరంభం నుంచే కలెక్షన్ల వర్షంతో రికార్డులను తిరగరాస్తోంది. పుష్ప రాజ్ బాక్సాఫీస్ను ఊహించని స్థాయిలో దుమ్ము దులిపాడు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పుష్ప 2 అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది.
బన్నీ పెర్ఫార్మెన్స్కి అమితాబ్ బచ్చన్ మాత్రమే కాదు, మొత్తం భారతదేశం ఫిదా అయిపోయింది. ఇప్పటివరకు 42 రోజుల్లోనే రూ.1850 కోట్లు వసూలు చేసిన పుష్ప 2, 43వ రోజున కూడా కోటి రూపాయల వసూళ్లు రాబట్టింది. హిందీ వర్షన్లో మాత్రమే రూ.850 కోట్లు వసూలు చేసింది. జవాన్ తర్వాత హిందీలో సోలోగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన సినిమా పుష్ప 2 మాత్రమే.బాహుబలి 2 లైఫ్ టైమ్ కలెక్షన్స్ను కూడా పుష్ప 2 దాటిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.230 కోట్ల షేర్ వసూలు చేసింది.
ఈ సమయంలో ‘రీ లోడెడ్ వర్షన్‘ విడుదల చేయడం సినిమాకు మరింత బలం ఇవ్వనుంది.టికెట్ ధరల విషయంలోనూ నిర్మాతలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సింగిల్ స్క్రీన్స్లో రూ.100, మల్టీప్లెక్స్లలో రూ.125 నుండి రూ.150 మధ్య టికెట్ ధరలు ఉండేలా చర్చలు జరుగుతున్నాయి. జనవరి 17న విడుదలవుతున్న ఈ కొత్త వెర్షన్తో పుష్ప 2 రూ.2000 కోట్ల క్లబ్లో చేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.