Minister key points on the Pune rape incident

పుణె అత్యాచార ఘటన పై మంత్రి కీలక విషయాలు

ఎదుటివారిని ఆకట్టుకునేందుకు చాలా నీట్‌గా రెడీ

పుణె: మహారాష్ట్ర మంత్రి యోగేశ్‌ కదమ్ పుణె అత్యాచార ఘటన పై స్పందించారు. మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. 9 గంటలకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన వెంటనే అర్ధగంటలో నిందితుడు ఎవరో గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అతడిని ట్రాక్ చేశాం. ఘటన తర్వాత అతడు బస్సులో వెళ్లిపోయాడు. అతడు గత నాలుగైదు రోజులుగా ఏం చేశాడో తెలిసింది. దురుద్దేశంతోనే పలు బస్టాండ్‌లకు వెళ్లాడు. అప్పుడు అతడు చాలా నీట్‌గా రెడీ అయ్యాడు. ఇన్‌షర్ట్‌ చేసుకున్నాడు. ఎదుటివారిని ఆకట్టుకునేందుకు అతడు అలా ప్రవర్తించివుండొచ్చు.

పుణె అత్యాచార ఘటన పై మంత్రి

అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు

కాగా.. అత్యంత రద్దీగా ఉండే బస్‌ స్టేషన్‌లలో ఒకటైన స్వర్‌గేట్‌లో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్‌స్టేషన్‌కు చేరుకున్న యువతితో నిందితుడు మాటలు కలిపాడు. అక్క అని సంబోధిస్తూ నమ్మించాడు. గ్రామానికి వెళ్లే బస్సు మరో చోట ఉందని చెప్పి బస్‌ స్టేషన్‌లోనే దూరంగా ఎవరూ లేని చోట ఆగి ఉన్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్‌ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.

రామదాస్‌ను పట్టుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలు

బస్సులోకి వెళ్లేందుకు యువతి తటపటాయించడంతో లోపల ప్రయాణికులు ఉన్నారని.. నిద్రలో ఉండటంతో వాళ్లు లైట్లు వేసుకోలేదని నమ్మించాడు. బస్సులోకి యువతి ప్రవేశించగానే తలుపు వేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు దత్తాత్రేయ రామదాస్‌ (36)గా పోలీసులు గుర్తించారు. అతడిపై అనేక కేసులు ఉన్నాయని, 2019 నుంచి బెయిల్‌ మీద ఉన్నాడని తెలిపారు. రామదాస్‌ను పట్టుకొనేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అత్యాచారం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే పోలీస్‌ స్టేషన్‌ ఉండటం గమనార్హం.

Related Posts
రేపు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
Srivari Arjitha Seva tickets will be released tomorrow

తిరుమల: రేపు (బుధవారం) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. భక్తుల సౌకర్యార్థం 2025 మార్చి నెలకు సంబంధించిన సుప్రభాతం, Read more

Air India: ఎయిరిండియా విమానంలో వ్యక్తి మృతి
Air India: ఎయిరిండియా విమానంలో వ్యక్తి మృతి

ఢిల్లీ నుండి లక్నోకు బయలుదేరిన ఎయిరిండియా విమానంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయాణీకుల్లో ఒకరు గాల్లో ప్రయాణిస్తూనే అనారోగ్యంతో మరణించడం కలకలం రేపింది.ఢిల్లీ నుంచి ల‌క్నో వెళుతున్న Read more

పటాకుల పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు మృతి
fire crackers blast

తరచుగా పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవిస్తున్నా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నది. దీనితో అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని విరుధునగర్‌ Read more

Rain:ఉపరితల ద్రోణి ప్రభావం తో తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు
Rain:ఉపరితల ద్రోణి ప్రభావం తో తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షపాతం విస్తారంగా నమోదవుతోంది. ముఖ్యంగా తమిళనాడులోని తూత్తుకూడి, కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్ Read more