balineni janasena

పిఠాపురం వేదికగా బాలినేని నిప్పులు

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన 12వ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వశక్తితో ఎదిగిన నాయకుడని కొనియాడారు. అయితే, జగన్ మాత్రం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకుని సీఎం అయ్యారని ఆరోపించారు. తన రాజకీయ జీవితాన్ని, గతంలో జగన్ కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ బాలినేని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

“నా ఆస్తి పోయింది.. జగన్ మాత్రం మరింత సంపాదించారు”

రాజకీయాల్లోకి వచ్చాక తన తండ్రి ఆస్తిలో సగానికి పైగా పోగొట్టుకున్నానని బాలినేని అన్నారు. కానీ, జగన్ మాత్రం తన ఆస్తులతో పాటు వియ్యంకుడి ఆస్తులను కూడా స్వాహా చేసుకున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో తనకు జరిగిన అన్యాయం మరెవరికి జరగకూడదని, తనకు తెలిసిన అన్ని నిజాలు ఒక్కొక్కటిగా బయట పెడతానని హెచ్చరించారు. రాజకీయంగా ఎంతటి పోరాటం ఎదురైనా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

janasena formation day2025
janasena formation day2025

“జగన్‌కు రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం, పవన్ కల్యాణ్ స్వశక్తి”

బాలినేని మాట్లాడుతూ, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు రాజకీయ భిక్ష పెట్టారని, అందుకే జగన్ వెంటే నడిచానని గుర్తు చేసుకున్నారు. కానీ, జగన్ తనను మోసం చేసి మొదట మంత్రి పదవి ఇచ్చి, తర్వాత తీసేశారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా తీవ్రంగా స్పందించారు. “పవన్ కల్యాణ్ కౌన్సిలర్ స్థాయి నాయకుడు” అనే జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ, “జగన్ స్వయంకృషితో ఎదిగిన నాయకుడు కాదు, తన తండ్రి దయతో సీఎం అయ్యాడు” అని ధ్వజమెత్తారు.

“కూటమి ఓపిక పడింది.. నేను ఉంటే లోపల వేసేవాడిని”

పవన్ కల్యాణ్ పోరాట శక్తిని ప్రశంసించిన బాలినేని, వైసీపీ పాలనలో జరిగిన అరెస్టుల గురించి ప్రస్తావించారు. పోసాని కృష్ణమురళీ, వల్లభనేని వంశీల అరెస్టుల సమయంలో జగన్ వెంటనే పరామర్శకు వెళ్లారని, అదే సమయంలో కుటుంబ సభ్యులను తిడితే ఎవ్వరూ ఊరుకోరని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ఆరు నెలలు ఓపిక పట్టిందని, తాను అధికారంలో ఉంటే ప్రజలకు నష్టం కలిగించిన వారిని లాఠీతో కొట్టి లోపల వేయించే వాడినని వ్యాఖ్యానించారు.

Related Posts
జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (G.I.S.) డే ..
gis day

ప్రతి సంవత్సరం నవంబర్ మూడవ బుధవారంనాడు, ప్రపంచవ్యాప్తంగా జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (G.I.S.) డే జరుపుకుంటారు. ఈ సంవత్సరం, G.I.S. డే నవంబర్ 20న జరుపుకోవడం జరుగుతుంది. Read more

సామ్‌సంగ్ షేర్లు 4 సంవత్సరాల కనిష్టానికి చేరాయి
samsung india gst investigation

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు ఈ సంవత్సరం 4 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దక్షిణ కొరియా టెక్నాలజీ దిగ్గజం, ఈ సంవత్సరం టీఎస్‌ఎమ్‌సీ (TSMC) మరియు ఎన్విడియా Read more

జాతీయ కరాటే ఛాంపియన్ షిప్ – 2025 ప్రారంభం
National Karate Championship 2025 Commencement

హైదరాబాద్: జపాన్ కారాటే అసోసియేషన్ ఇండియా అద్వర్యం లో హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదిక ఐదు రోజులపాటు నిర్వహించనున్న మొదటి జేకేఏ ఇండియా ఇన్విటేషనల్ ఇంటర్నేషనల్ Read more

రెడ్ జోన్లో 26 ఎమ్మెల్యేలు!
రెడ్ జోన్లో 26 ఎమ్మెల్యేలు!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సర్వే ప్రకారం, ముఖ్యంగా కాంగ్రెస్ గెలిచిన 65 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇతర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *