runamafi 4th fhace

నాలుగో విడుత రుణమాఫీని విడుదల చేసిన సీఎం రేవంత్

మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధుల‌ను విడుదల చేశారు సీఎం రేవంత్. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావడం తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన సంబరాలు జరుపుతుంది. ముఖ్యంగా రైతులకు కాంగ్రెస్ సర్కార్ గొప్ప వరమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై దృష్టి సారించింది. ఏడాదిలోపు మూడు విడతలుగా రైతుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం..ఈరోజు పాలమూరు వేదికగా నాల్గో విడత రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు విడతలుగా రైతులకు రుణమాఫీ చేసింది. తొలి విడత 11 లక్షల 34 వేల 412 మందికి లక్ష వరకు రుణమాఫీ చేసింది. రెండో విడతలో మరో ఆరున్నర లక్షల మందికి లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసింది. మూడో విడతలో నాలుగున్నర లక్షల మందికి 2 లక్షల వరకు చేసింది.

శనివారం నాలుగో విడతగా మూడు లక్షల మంది రైతులకు 3 వేల కోట్ల రూపాయలను విడుదల చేసింది. మాఫీ కాని రైతుల కోసం నాలుగో విడుత రుణమాఫీ రూ.2747.67 కోట్లు నిధుల‌ను విడుదల చేశారు. రుణ‌మాఫీలో నెల‌కొన్న టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి నిధుల‌ను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. రుణ‌మాఫీ జ‌ర‌గ‌ని 3.14 ల‌క్ష‌ల మంది రైతుల ఖాతాల‌లోకి ఈ నిధులు జ‌మ అవుతాయ‌ని చెప్పారు.
కొంత‌మందికి ఆధార్ లో స‌మ‌స్య‌లు, టెక్నిక‌ల్ కార‌ణాలు, రూ.2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ రుణం ఉండ‌టం వ‌ల్ల మాఫీ అవ్వ‌లేదు. ఆ రైతుల‌కు కూడా న్యాయం జ‌రిగేలా నేడు రైతుపండుగ స‌భలోనే నిధులను విడుద‌ల చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారు కొలువుదీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వ్యాప్తంగా డిసెంబరు 1 నుంచి 9 వరకు ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఉత్సవాల్లో భాగంగా కీలకమైన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 9 రోజుల పాటు జరిగే సంబరాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కీలక భూమికగా ఉండేలా కార్యాచరణను రూపొందిస్తోంది.

Related Posts
మనస్సు విరిగిపోవడం వల్లనే వైసీపీ నుంచి వైదొలిగా : విజయసాయిరెడ్డి
I left YSRCP because I was mentally broken.. Vijayasai Reddy

అమరావతి: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సీఐడీ విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్‌ చుట్టూ కోటరీ ఉందని.. ఆ కోటరీ Read more

స్పీకర్ అలా వ్యవహరించకపోతే అవిశ్వాసం పెడతాం – హరీశ్ రావు
నిరూపించండి ఇప్పుడే రాజీనామా చేస్తా: హరీష్ రావు

తెలంగాణ శాసనసభలో స్పీకర్ వ్యవహారశైలి పట్ల బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్టీ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టంగా హెచ్చరించారు. స్పీకర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే Read more

కేటీఆర్ కు భయం పట్టుకుంది – కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్
Congress VIP adisrinivas

ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతున్న.. గత పది Read more

Raja Singh: తెలంగాణకు త్వరలో కొత్త బీజేపీ అధ్యక్షుడు:రాజాసింగ్
Raja Singh: బీజేపీ కొత్త నాయకత్వంపై రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణలో బీజేపీ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్లడించారు. అయితే, ఈ కొత్త అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? రాష్ట్ర కమిటీనా, లేక Read more