narayana murthy

నారాయణమూర్తి రూ.1900 కోట్లు సంపద క్షీణత

ఈ రోజుల్లో ‘వర్క్ లైఫ్ బ్యాలెన్స్’పై చర్చ రోజుకో మలుపు తిరుగుతుంది. వారానికి 70 గంటలు పని చేయాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చేసిన ప్రకటనతో ఈ చర్చ మొదలైంది. అయితే తాజగా నారాయణమూర్తి కుటుంబ సంపద కేవలం 24 గంటల్లో దాదాపు రూ.1,900 కోట్లు తగ్గింది. నిన్న శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో క్షీణత కనిపించిగా ఈ సమయంలో ఇన్ఫోసిస్ షేర్లు భారీగా పతనమయ్యాయి. దింతో కంపెనీ మార్కెట్ క్యాప్ లేదా మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోయింది.

భారతీయులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కాకుండా పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ్ మూర్తి అన్నారు. వారానికి ఆరు రోజులు కాకుండా ఐదు రోజులు మాత్రమే పని చేసే సంప్రదాయాన్ని కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకూండా వారానికి 70 గంటలు పని చేయాలని ఆయన సూచించారు. ఆయన ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది. చివరికి పెద్ద పెద్ద దిగ్గజా కంపెనీ ప్రముఖులు కూడా ఇందులో భాగమైయ్యారు.
ఇన్ఫోసిస్ షేర్ల పతనం శుక్రవారం బిఎస్‌ఇలో ఇన్ఫోసిస్ షేర్లు 5.8%తో భారీగా పడిపోయాయి. నిన్న సాయంత్రానికి ఇన్ఫోసిస్ షేరు రూ.1,815.10 వద్ద ముగిసింది. ఈ విధంగా నారాయణ మూర్తి కుటుంబ సంపదలో భారీ క్షీణత సంభవించింది ఇంకా అతని మొత్తం సంపద దాదాపు రూ.1,900 కోట్లు తగ్గింది. ఇన్ఫోసిస్‌లో మొత్తం 4.02% ఉన్న కుటుంబ వాటా, షేర్ల విక్రయం తర్వాత రూ.30,292 కోట్లకు తగ్గింది. ఈ విధంగా ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7.53 లక్షల కోట్లకు తగ్గింది.

Related Posts
ఎన్నికల్లో పోటీ కొత్త కావొచ్చు…పోరాటం మాత్రం కాదు: ప్రియాంక గాంధీ
Priyanka Gandhi Vadra Pens A Heartfelt Letter To The People of Wayanad

న్యూఢిల్లీ: కాంగ్రస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఇటీవల వయనాడ్ లోక్‌సభ స్థానం కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ రాజీనామాతో జరుగుతున్న ఉప Read more

ఆశారాంకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిలు
asaram bapu

ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపూకు భారత అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. 2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన 86 ఏళ్ల ఆశారాంకు Read more

ఆర్జీ కార్ కేసులో సంజయ్ రాయ్ కోర్టులో ఏం చెప్పాడు?
ఆర్జీ కార్ కేసులో సంజయ్ రాయ్ కోర్టులో ఏం చెప్పాడు?

కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో మాజీ సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించారు. తనను Read more

తమిళనాడులో దారుణ ఘటన..విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్‌ రేప్‌
Atrocious incident in Tamil Nadu..A student was raped by a gang of teachers

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు. ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *