goods train

తెలంగాణలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

ఇటీవల కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక సమస్య , డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతూ ..ఆస్థి , ప్రాణ నష్టం వాటిల్లుతుంది. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట రైలు ప్రమాద ఘటన వెలుగులోకి వస్తుండడం తో ప్రయాణికులు రైలు ప్రయాణం అంటేనే వామ్మో అంటున్నారు. తాజాగా తెలంగాణ లో గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. పెద్దపల్లి – రాఘవాపూర్ దగ్గర మంగళవారం రాత్రి సమయంలో ఓవర్ లోడ్ కారణంగా ఆరు గూడ్స్ భోగీలు పట్టాలు తప్పాయి.

దీంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది మరమ్మతులు ప్రారంభించింది. గూడ్స్ రైలు బోగీలు పట్టాలపై పడిపోవడం వల్ల వాటిని తొలగించేందుకు సమయం పడుతుందని.. బుధవారం ఉదయం వరకు రైళ్ల రాకపోకలు కొనసాగే అవకాశం లేదని అధికారులు తెలియజేశారు. ఎక్కడికక్కడ రైళ్లు నిలిచిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక మూడు రోజుల క్రితం రైలు ఇంజిన్‌ – బోగీల మధ్య ఇరుక్కుపోయి ఉద్యోగి మృతి చెందిన ఘటన దేశ వ్యాప్తంగా చర్చ గా మారింది. బిహార్‌‌లోని సమస్తిపూర్ జిల్లా బరౌనీ రైల్వే జంక్షన్‌లో షంట్ మ్యా్న్‌గా పనిచేస్తున్న అరుణ్ కుమార్ రౌత్ (35) రైలు ఇంజిన్, పార్సెల్ వ్యాన్ బోగీ మధ్య కప్లింగ్‌ను జత చేస్తుండగా.. లోకో పైలట్ ఒక్కసారిగా రైలు ఇంజిన్‌ను వెనక్కి పోనిచ్చాడు. దీంతో అరుణ్ కుమార్.. రైలు ఇంజిన్, బోగీ మధ్య చిక్కుకొని నలిగిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. లోకో పైలట్‌ జరిగిన ప్రమాదాన్ని గమనించి ఇంజిన్‌ను ముందుకు నడిపే ప్రయత్నం కూడా అలాగే వదిలేసి.. ఇంజిన్‌ దిగి అక్కడి నుంచి పారిపోయాడు. అరుణ్ కుమార్ విలవిల్లాడుతూ క్షణాల వ్యవధిలో ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారకర ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొంత మంది ప్రయాణికులు తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించారు.

Related Posts
జగిత్యాల జిల్లాలో పండుగుపూట విషాదం
subbaraju dies

దసరా పండగ వేళ హోంగార్డు ఇంట్లో విషాదం నెలకొన్న ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మెట్‌పల్లి పట్టణానికి చెందిన హోంగార్డు సుబ్బరాజు జగిత్యాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో Read more

శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
Student suicide in Sri Chaitanya College

హైదరాబాద్‌: షాద్ నగర్ కు చెందిన కౌశిక్ రాఘవ (17) హైదరాబాద్ మియాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే Read more

పాతాళగంగలో స్నానానికి దిగిన తండ్రి, కుమారుడు గల్లంతు
పాతాళగంగ పుణ్యస్నానం చేస్తున్న తండ్రి, కుమారుడు మృతిచెందారు.

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో విషాదం శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం పెద్ద హర్షోల్లాసాలతో జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భక్తులు తమ ఆధ్యాత్మికతను పునరుద్ధరించుకునే ఉద్దేశంతో, పాతాళగంగ Read more

దావోస్ పెట్టుబడులపై హరీష్ రావు ఫైర్
దావోస్ పెట్టుబడులపై హరీష్ రావు ఫైర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ, ఆ దావాలకు చట్టబద్ధత లేదని మాజీ మంత్రి టి. హరీష్ రావు మండిపడ్డారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *