టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్

టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్..

రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు బాలీవుడ్ లో హవా చేస్తోంది.మొదటగా తెలుగు ఇండస్ట్రీలో మొదలైన ఈ కల్చర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించింది. ఒకప్పుడు చిన్నగా ఉన్న ఈ ట్రెండ్, ఇప్పుడు పెద్ద విజయంగా మారింది.పాత సినిమాలు మళ్లీ థియేటర్లలో చూపించడం, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందడం చూస్తున్నాం.మూడేళ్ల క్రితం,మహేష్ బాబుకు సంబంధించి పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమాను రీ రిలీజ్ చేశారు.ఈ సినిమా కి వచ్చిన స్పందనను చూసిన తర్వాత, ఇండస్ట్రీలో సుమారు 40 సినిమాలు మళ్లీ విడుదలయ్యాయి.తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా గిల్లి వంటి పాత సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్ కూడా ఈ ట్రెండ్‌లో భాగమైంది. ఇటీవల కాలంలో, బాలీవుడ్‌లో పాత సినిమాలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం మొదలైంది.

అభిమానులు తమ అభిమాన నటుల సినిమాలను మళ్లీ థియేటర్లలో చూసి ఆనందం పొందుతున్నారు. 2024లో, బాలీవుడ్ నుంచి రీ రిలీజ్‌ల ద్వారా 65 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.వాటిలో తుంబాడ్ 35 కోట్ల రూపాయల వసూళ్లతో టాప్ లో ఉంది. 2018లో విడుదలైన తుంబాడ్ మొదట్లో 15 కోట్ల మేర మాత్రమే వసూళ్లు చేసింది. కానీ రీ రిలీజ్ ద్వారా అది దూసుకెళ్లింది. మరో రీ రిలీజ్ విజయం లైలా మజ్ను సినిమాతో వచ్చింది.

2018లో దీని వసూళ్లు 2 కోట్లలోపే ఉన్నాయ్. కానీ, 2024లో ఈ సినిమాకు 14 కోట్ల వసూళ్లు వచ్చాయి.ఇదే విధంగా రాక్ స్టార్ 6 కోట్ల రూపాయలతో,ఏ జవానీ హై దివానీ 3 కోట్ల రూపాయలతో, కల్ హో నా హో 5.8 కోట్ల రూపాయలతో వసూళ్లు సాధించాయి.ఈ రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతోంది. న్యూ వర్షన్స్ మరియు క్లాసిక్స్ ఆడుతూ, ప్రేక్షకులను థియేటర్లకు తీసుకువస్తున్నాయి.

Related Posts
Kannappa : కన్నప్ప మూడో పాట విడుదల
Kannappa కన్నప్ప మూడో పాట విడుదల

Kannappa : కన్నప్ప మూడో పాట విడుదల డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' నుంచి మూడో పాటకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. 'మహాదేవ Read more

Samantha: కొత్త ప్రయాణం మొదలు అంటూ సమంత పోస్ట్
Samanta: కొత్త ప్రయాణం మొదలు అంటూ సమంత పోస్ట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో స్టార్‌డమ్ సంపాదించిన ఆమె, ప్రస్తుతం వ్యక్తిగత జీవితంతో పాటు కెరీర్‌లో కొత్త ప్రయాణాన్ని Read more

మెగా హీరోలతో మంచు మనోజ్ సంక్రాంతి సంబరాలు
అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన,

దేశవ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నారు.అన్ని వయసుల వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ సంబరాల్లో Read more

Siddhu Jonnalagadda: కోహినూర్‌ వజ్రం తిరిగి తీసుకొస్తానంటున్న సిద్దు జొన్నలగడ్డ
kohinoor

తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సిద్దు జొన్నలగడ్డ, "డీజే టిల్లు"తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ప్రస్తుతం, ఆయన రెండు కొత్త చిత్రాలలో కథానాయకుడిగా నటిస్తున్నాడు. Read more