हिन्दी | Epaper
నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం.. నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ భారత్‌కు ఘోర పరాజయం నేటి నుంచి U-19 ODI ఆసియా కప్ ప్రధాని మోదీని కలవనున్న మెస్సీ IPL మినీ వేలం..

జామ్ నగర్ సంస్థానానికి కాబోయే మహారాజుగా భారత మాజీ క్రికెటర్‌ అజ‌య్‌ జడేజా!

Divya Vani M
జామ్ నగర్ సంస్థానానికి కాబోయే మహారాజుగా భారత మాజీ క్రికెటర్‌ అజ‌య్‌ జడేజా!

రాయల్ ఫ్యామిలీ జామ్ నగర్ సంస్థానం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను జామ్ నగర్ సంస్థానానికి కాబోయే మహారాజుగా ప్రకటించింది. ప్రస్తుత జామ్ సాహెబ్ శత్రుసల్యసింహ్జీ దిగ్విజయ్ సింహ్‌జీ, దసరా పర్వదినం సందర్భంగా ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా శత్రుసల్యసింహ్జీ మాట్లాడుతూ, “పాండవులు తమ 14 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని విజయవంతంగా ముగించిన దసరా పర్వదినం ఎంతో ముఖ్యమైనది. అలాగే, ఈ ప్రత్యేక రోజున అజయ్ జడేజా నా వారసుడిగా, నవానగర్ (జామ్ నగర్ పాత పేరు) తర్వాతి జంసాహెబ్‌గా ఉండటానికి అంగీకరించడంతో, ఈ విజయం నాకు కూడా ఎంతో మహత్తరమైనది. ఇది జామ్ నగర్ ప్రజలకు ఒక గొప్ప వరంగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను” అని అన్నారు.

జామ్ నగర్ రాజ కుటుంబానికి క్రికెట్ రంగంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ రాజ కుటుంబానికి చెందిన కేఎస్ రంజిత్ సింహ్‌జీ, కేఎస్ దులీప్ సింహ్‌జీ పేర్లతోనే భారత దేశంలో అత్యంత ప్రముఖమైన రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలు ఏర్పాటయ్యాయి. అజయ్ జడేజాకు కూడా ఈ రాయల్ ఫ్యామిలీతో సన్నిహిత అనుబంధం ఉంది.

అజయ్ జడేజా భారత క్రికెట్ జట్టుకు 1992 నుంచి 2000 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ కాలంలో 196 వన్డేలు, 15 టెస్టుల్లో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్ క్రికెట్ జట్టుకు మెంటార్‌గా పనిచేస్తున్న జడేజా, రాయల్ ఫ్యామిలీలో కీలక స్థానాన్ని ఆక్రమించడం అతని జీవితంలో మరో గౌరవప్రదమైన ఘట్టంగా నిలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870