ఫార్ములా-ఇ రేస్తో ముడిపడి ఉన్న ఆర్థిక అవకతవకలపై హైదరాబాద్లోని అవినీతి నిరోధక బ్యూరో మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత కెటిఆర్ను ప్రశ్నించింది. గ్లాస్ బారియర్తో ప్రత్యేకించి, ప్రశ్నోత్తరాల సమయంలో హాజరు కావడానికి కేటీఆర్ న్యాయవాద బృందాన్ని హైకోర్టు అనుమతించింది. తాని తర్వాత కెటిఆర్ అనుచరులు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ నిర్వహించినందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ మంత్రి కేటీ రామారావుపై బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ఫార్ములా-ఇ కేసులో ఏజెన్సీ ప్రశ్నించిన తరువాత రామారావు ఎసిబి కార్యాలయం నుండి బయటకు వస్తుండగా, తన మద్దతుదారులతో కలిసి ఎసిబి కార్యాలయం నుండి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ చేపట్టారు. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడం వల్ల సమీపంలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని పోలీసులు పేర్కొన్నారు. బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.