ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్పై ఢిల్లీ బీజేపీ మంగళవారం నాడు విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్ హిందువుల పట్ల ప్రేమను ఎన్నికల సమయంలో మాత్రమే చూపిస్తారని ఆరోపిస్తూ, ఆయనను “చునావి హిందువు” (ఎన్నికల హిందువు) అని అభివర్ణించింది.
ఢిల్లీ బీజేపీ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ X (మాజీ ట్విట్టర్)లో ఒక పోస్టర్ను షేర్ చేసింది. ఆ పోస్టర్లో కేజ్రీవాల్ రుద్రాక్ష మాలలు, పూలదండలు ధరించి, శరీరమంతా రోలీ (కుంకుమ)తో కనిపించారు.
పోస్టర్పై వాక్యం ఇలా ఉంది, “మందిర్ జానా హై బాస్ మేరే లియే ఏక్ చలావా, పూజారియోం కా సమ్మన్ బాస్ మేరా చునావి దిఖావా, సనాతన్ ధర్మ కా మైనే హుమేష్ మజాక్ బనాయా” (ఆలయాలను సందర్శించడం మోసపూరిత వ్యూహం, అర్చకులను గౌరవించడం ఎన్నికల ప్రలోభం, హిందూ ధర్మాన్ని ఎగతాళి చేయడం నా విధానం).

బీజేపీ విమర్శలు
ఢిల్లీ బీజేపీ ఇలా వ్యాఖ్యానించింది, “గత పదేళ్లుగా ఇమామ్లకు జీతాలు అందించిన వ్యక్తి ఇప్పుడు పూజారులు, గ్రంథిల పట్ల శ్రద్ధ చూపిస్తున్నాడు. గతంలో ఈయన ఆలయాల వద్ద మద్యం దుకాణాలను ప్రారంభించి, హిందూ వ్యతిరేక రాజకీయాలు చేశాడు. ఇప్పుడు అకస్మాత్తుగా పూజారుల గౌరవ వేతనం గురించి మాట్లాడటం ఎన్నికల కుతంత్రం మాత్రమే.”
‘పూజారి గ్రంథి సమ్మాన్ యోజన’ ద్వారా హిందూ, సిక్కు పూజారులకు నెలకు ₹18,000 గౌరవ వేతనం అందించే పథకాన్ని కేజ్రీవాల్ నిన్న ప్రకటించారు.
బీజేపీ నేతలు ఈ పథకాన్ని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఈ చర్యను హిందూ ఓట్లను గెలుచుకునే ప్రయత్నంగా అభివర్ణించారు. ఆయన అన్నారు, “2013 నుంచి ఆప్ ప్రభుత్వం వివిధ వర్గాలకు జీతాలు అందజేస్తోంది. కానీ పూజారులు, గ్రంథిలకు ఇలాంటి పథకాన్ని ఇప్పటివరకు పరిగణలోకి తీసుకోలేదు.”
మహిళా సమ్మాన్ యోజనపై కూడా కేజ్రీవాల్ ను విమర్శల తీవ్రంగా విమర్శింస్తున్నారు. ఈ పథకం ఉనికిలో లేదని ఢిల్లీ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ప్రకటించింది.
ఇదంతా కేజ్రీవాల్ పై ఎన్నికల సమయంలో మాత్రమే మతం పట్ల శ్రద్ధ చూపుతారనే విమర్శలకు దారితీసింది.