kakarla venkatram reddy

కూటమికి ఉద్యోగ నేత రెడ్ బుక్ వార్నింగ్

వెంకట్రాc ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను టార్గెట్ చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదే పరిస్ధితి కొనసాగితే ఉద్యోగులు ఏం చేయాలో కూడా ఆయన చెప్పేశారు.
గత వైసీపీ ప్రభుత్వంలో వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉండే వారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఓటేయాలని ఆయన ఊరూరా తిరిగి ప్రచారం చేయడంతో ఈసీ ఆదేశాలతో ఆయనపై వేటు పడింది. అప్పట్లో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. అలాగే సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడిగా కూడా ఆయన్ను తొలగించి కొత్తగా ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి ఉద్యోగుల వేధింపులపై గళం విప్పారు.

Advertisements
kakarla venkatram reddy
కూటమికి ఉద్యోగ నేత రెడ్ బుక్ వార్నింగ్


భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారు
ఉద్యోగులను ఎవరైనా ఇబ్బంది పెడితే వారి పేర్లు రాసి పెట్టుకోవాలని వారికి సూచించారు. అలాంటి వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకుంటారని వెంకట్రామిరెడ్డి రెడ్ బుక్ తరహాలోనే హెచ్చరికలు చేశారు. సమీక్షా సమావేశాల్లో కింది స్దాయి అధికారుల్ని పైస్థాయి అధికారులు వేధిస్తున్నారని, టీడీపీ కార్యకర్తలొస్తే గౌరవంగా టీ ఇచ్చి మాట్లాడి పంపాలని, లేకపోతే మీ సంగతి చూస్తామని మంత్రులు హెచ్చరికలు చేస్తున్నారని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు.
అలాగే సచివాలయ ఉద్యోగులు తెల్లవారు జామునే వెళ్లి తలుపులు కొట్టి పెన్షన్లు ఇమ్మంటున్నారని, ఉదయం 8 గంటల కల్లా ఇస్తే ప్రపంచం ఏమైనా తలకిందులవుతుందా అని వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఇప్పటికైనా ఐఆర్ ఇవ్వాలని, పెండింగ్ డీఏల్లో ఒక్కటైనా ఇవ్వాలని వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Related Posts
మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి
chandrababu daggubati ven

దాదాపు మూడు దశాబ్దాల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక వ్యక్తులు అయిన నారా చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఈ నెల Read more

తెలుగు ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు
CMs Chandrababu and Revanth Reddy congratulated Telugu people on Bhogi festival

హైదరాబాద్: తెలుగు వారి లోగిళ్లలో పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి. మూడు రోజుల పండుగలో తొలి రోజు భోగిని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర Read more

ఈఏపీసెట్‌కు ఏపీలో పరీక్ష కేంద్రాలు ఔట్‌
ఈఏపీసెట్‌కు ఏపీలో పరీక్ష కేంద్రాలు ఔట్‌

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈఏపీసెట్‌ పరీక్షకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కన్వీనర్‌ కోటా సీట్లను నిలిపివేసిన నేపథ్యంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని పరీక్షా కేంద్రాలను Read more

మాజీ మంత్రి రోజాకు షర్మిల కౌంటర్‌..
roja sharmila

ట్విట్టర్ వేదికగా ‘వైఎస్ షర్మిల .. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లిష్ అర్థం కాదా? నిన్న మీ అన్న‌ రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి Read more

×