కీలక బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం

షట్‌డౌన్‌ గండం నుంచి అగ్రరాజ్యం అమెరికా బయటపడింది. కీలకమైన ద్రవ్య వినిమయ బిల్లుకు ప్రతినిధుల సభ చివరి క్షణంలో ఆమోదం తెలిపింది. శుక్రవారం రాత్రిలోగా ఈ బిల్లు ఆమోదం పొందకపోతే ఆర్థిక ప్రతిష్ఠంభన నెలకొనేది. అయితే, గడువుకు కొన్ని గంటల ముందు స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ ప్రవేశపెట్టిన కొత్త బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. అనంతరం ఈ బిల్లును సెనెట్‌కు పంపగా అక్కడ కూడా ఆమోదం లభించింది. ఈ కీలక బిల్లుకు ఆమోదం లభించడంతో అమెరికా షట్‌డౌట్‌ గండం నుంచి తప్పించుకున్నట్లైంది.
బైడెన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తిరస్కరించారు. దీంతో మార్చి 14 వరకు ప్రభుత్వానికి నిధులను సమకూర్చేలా ప్రతినిధుల సభ స్పీకర్‌ మైక్‌ జాన్సన్‌ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. రుణాలపై సీలింగ్‌ను రెండేండ్లపాటు సస్పెండ్‌ చేయడం సహా ట్రంప్‌ లేవనెత్తిన పలు డిమాండ్లను ఇందులో చేర్చారు. దీంతో కొత్త బిల్లుకు ట్రంప్‌ మద్దతు తెలపడంతోపాటు దానికి అనుకూలంగా ఓటేయాలని రిపబ్లికన్లకు పిలుపునిచ్చారు. కానీ, ఈ బిల్లును డెమోక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతినిధుల సభలో ఓటింగ్‌ నిర్వహించడంతో ఆ బిల్లు 235-174 తేడాతో తిరస్కరణకు గురైంది.
బిల్లుకు క్లిష్టంగా ఆమోదం
ఈ బిల్లును వ్యతిరేకించిన డెమోక్రాట్లకు ఏకంగా 38 మంది రిపబ్లికన్లు మద్దతు తెలపడం చర్చనీయాంశంగా మారింది. సెనేట్‌లో కూడా డెమోక్రాట్ల పట్టు కొనసాగుతుండటంతో ఈ బిల్లుకు ఆమోదం లభించడం క్లిష్టంగా మారింది. శుక్రవారం రాత్రిలోగా ప్రభుత్వానికి నిధులు సమకూర్చడంలో పార్లమెంట్‌ విఫలమైతే అమెరికాలో మరోసారి షట్‌డౌన్‌ తప్పదని, ఇది ఎంత కాలం కొనసాగుతుందో చెప్పలేమని నిపుణులు పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లులో మళ్లీ మార్పులు చేయాల్సి వచ్చింది.

Related Posts
క్రిస్మస్ వేడుకలలో ప్రపంచ దేశాల ఐక్యత..
christmas

క్రిస్మస్ వేడుకలు ప్రారంభం కావడంతో, ప్రపంచవ్యాప్తంగా పండుగ సీజన్ మరింత ఉత్సాహంగా మారింది. యేసుక్రీస్తు జన్మదినాన్ని ఉత్సాహంగా జరుపుకునే ఈ రోజు, ఆనందం మరియు సద్భావనతో ప్రపంచవ్యాప్తంగా Read more

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ట్రంప్ -జెలెన్స్కీ సమావేశం
నా స్థానాన్ని భర్తీ చేయడం సులభం కాదు: జెలెన్స్కీ

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఓవల్ ఆఫీసులో జరిగిన సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో ట్రంప్ జెలెన్స్కీపై తీవ్రంగా Read more

ఇండియన్స్ కి ఇకపై ఉద్యోగాలు బంద్ అంటున్న ట్రంప్
ఇండియన్స్ కి ఇకపై ఉద్యోగాలు బంద్ అంటున్న ట్రంప్

భారతీయ విద్యార్థుల్లో అమెరికాలో చదువుకునే అంగీకారం రోజుకో రోజు పెరిగిపోతుంది.వీరి మధ్య ప్రత్యేకంగా వర్కింగ్ వీసాతో వెళ్లే వాళ్లకు కొంత సౌకర్యం ఉంటుందని చెప్పవచ్చు.అయితే, లక్షల రూపాయల Read more

నోబెల్‌ శాంతి పురస్కారానికి ఎలాన్‌ మస్క్‌ నామినేట్‌
elon musk

ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్‌, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సర్కార్‌ కొత్తగా ఏర్పాటు చేసిన ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్న్‌మెంట్‌ ఎఫిషియెన్సీ’(డోజ్‌) విభాగం అధిపతి ఎలాన్‌ మస్క్‌ ప్రతిష్టాత్మక Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *