టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమయ్యాడు.43 ఏళ్ల వయసులో కూడా ధోనీ ఐపీఎల్ 2025 సీజన్ కోసం బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు.ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోలో, ధోనీ జట్టుతోనే కనిపిస్తూ, అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు.ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పినా, ఐపీఎల్లో తన మాయ కొనసాగిస్తున్నాడు. 2024లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఆడిన తర్వాత కూడా అతను 2025లో ఆడతాడని తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా ఫొటోలో ధోనీ పసుపు ప్యాడ్లు, చెన్నై జెర్సీ ధరించి ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడు. ఇది చూసిన అభిమానులు “ఐపీఎల్ కోసం వెయింటింగ్!”అంటూ కామెంట్లు చేస్తున్నారు.

2008 నుంచి ఐపీఎల్లో భాగమైన ధోనీ తన కెరీర్ను సూపర్ విజయాలతో మలిచాడు.CSKకి 5 సార్లు ట్రోఫీ గెలిపించిన ధోనీ, అంతర్జాతీయ క్రికెట్లో కూడా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను భారత్ ఖాతాలో వేసాడు.ధోనీ ఇప్పటివరకు 264 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా, 229 ఇన్నింగ్స్లలో 5243 పరుగులు చేశాడు.ఈ జాబితాలో 24 అర్ధశతకాలూ ఉన్నాయి. కెప్టెన్గా తన అద్భుతమైన వ్యూహాలతో చరిత్ర సృష్టించిన ధోనీ, ఐపీఎల్లో సత్తాచాటడం ఇంకా కొనసాగిస్తుండటం అందరికీ సంతోషకర విషయం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ 2025 మార్చి 21న ప్రారంభం కానుంది.ఈ సీజన్ తొలి మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరగనుంది. 10 జట్లు ఈ సీజన్ టైటిల్ కోసం పోటీపడతాయి. అభిమానులు ధోనీ మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుస్తాడని ఆశిస్తున్నారు. అందరూ అనుకున్నట్లుగా రిటైర్మెంట్ మాట కూడా ప్రస్తావించని ధోనీ, ప్రాక్టీస్తో సన్నద్ధమవుతూ మరోసారి క్రికెట్ మైదానంలో హవా చూపించబోతున్నాడు. CSK అభిమానులు “తలా”ను మళ్లీ మైదానంలో చూసేందుకు ఆతృతగా ఉన్నారు