ap cabinet

ఏపీ కేబినెట్ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల ఫైర్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని విభాగాల్లో ప్రక్షళన చేస్తున్నది. ఇందులో భాగంగా ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు అనుకున్నంత స్దాయిలో ప్రభావవంతంగా పనిచేయడం లేదని భావిస్తున్న కూటమి సర్కార్ వాటిని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. అలాగే అందులో పనిచేస్తున్న ఉద్యోగులను సైతం హేతుబద్ధీకరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నిర్ణయాలకు రాష్ట్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. దీన్ని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా రాష్ట్ర కేబినెట్ లో తీసుకున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య తీర్మానించింది. గుంటూరు బ్రాడీపేటలోని యుటిఎఫ్‌ కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు సమాఖ్య రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ కె.అనురాధ, డాక్టర్‌ గురుస్వామి కేబినెట్ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Advertisements

రేషనలైజేషన్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ కలెక్టర్లు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు వినతిపత్రాలు ఇవ్వాలని ఉద్యోగులు నిర్ణయించారు, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాడాలని నిర్ణయించారు. గ్రామ, వార్డు సచివాయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఆలస్యం చేయడం వల్ల నష్టపోయిన తొమ్మిది నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని వారు కోరుతున్నారు. ఉద్యోగంలో చేరిన తేదీ నుండి సర్వీసు లెక్కించి, నోషనల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న డిఎలు ఇవ్వాలని సచివాలయాల ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.
సచివాలయాల్లో ఎఎన్‌ఎం, హెల్త్‌ సెక్రెటరీలకు యాప్‌ల పని భారం తగ్గించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అనేక రకాలైన సర్వేలు ఇచ్చి త్వరగా పూర్తి చేయాలని ఉద్యోగులను ఒత్తిడి చేయడం సరికాదని వారు చెప్తున్నారు.

Related Posts
వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ బేగ్ అరెస్టు
వైసీపీ కౌన్సిలర్ అహ్మద్ బేగ్ అరెస్టు

డబ్బుకోసం పట్టపగలే ఒక వ్యక్తిని కిడ్నాప్‌ చేసి కారులో చిత్రహింసలు పెట్టిన కేసులో వైసీపీ కౌన్సిలర్‌, మరొక వ్యక్తిని పోలీసులు అరె్‌స్టచేశారు. ఈ నెల 5వ తేదీనగుంటూరు Read more

Andhrapradesh :ఏపీ లో లులు మాల్స్ ఏర్పాటు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Andhrapradesh :ఏపీ లో లులు మాల్స్ ఏర్పాటు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటు చేసేందుకు లులు గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గ సమావేశంలో ఈ Read more

ఏపీలో కీలకమైన 6 రైళ్లు రద్దు
4 more special trains for Sankranti

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో కుంభమేళాకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ క్రమంలో నిత్యం తిరుగుతున్న కొన్ని రైళ్లను రద్దుచేసి కుంభమేళాకు పంపిస్తోంది. Read more

జనసేనలో చేరడం పై తమ్మినేని సీతారాం క్లారిటీ
tammineni

వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తన పార్టీ మార్పు వార్తలను ఖండించారు. జనసేనలో చేరుతున్నారన్న ప్రచారంపై ఆయన స్పష్టతనిచ్చారు. "నేను వైసీపీలోనే కొనసాగుతాను. జనసేనలో చేరాల్సిన Read more

×