స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన వినియోగదారులకు మెరుగైన ఆర్థిక వశ్యతను, విలువను అందించేందుకు ఎస్బీఐ కొత్త డిపాజిట్ పథకాలు ప్రవేశపెట్టింది. ఇవి ‘హర్ ఘర్ లఖ్పతి’ మరియు ‘ఎస్బీఐ పాట్రాన్స్’ పేరుతో అందుబాటులోకి వచ్చాయి.
‘హర్ ఘర్ లఖ్పతి’ పథకం
- ఇది ప్రీ-కాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్, దీనిలో వినియోగదారులు ₹1,00,000 లేదా దాని గుణకాలను డిపాజిట్ చేయవచ్చు.
- ఈ పథకం ద్వారా వినియోగదారులు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రణాళిక చేసుకోవచ్చు.
- 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన పిల్లలకు కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు.
- ఈ పథకం వారిని చిన్న వయస్సు నుంచే పొదుపు చేయడం, ఆర్థిక ప్రణాళికలపై దృష్టి పెట్టేలా ప్రేరేపిస్తుంది.

‘ఎస్బీఐ పాట్రాన్స్’ పథకం
- ఇది 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన టర్మ్ డిపాజిట్ పథకం.
- ఈ పథకం ద్వారా మెరుగైన వడ్డీ రేట్లు అందుబాటులో ఉంటాయి.
- ప్రస్తుత మరియు కొత్త టర్మ్ డిపాజిట్ వినియోగదారుల కోసం ఈ పథకం ప్రారంభించారు.
ఎస్బీఐ చైర్మన్ సిఎస్ సెట్టీ మాట్లాడుతూ, “మా వినియోగదారుల ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా లక్ష్య-ఆధారిత డిపాజిట్ ఉత్పత్తులను రూపకల్పన చేయడం మా ప్రాధాన్య లక్ష్యం. సాంప్రదాయ బ్యాంకింగ్ను సమగ్రంగా, ప్రభావవంతంగా మార్చడానికి మేము కట్టుబడి ఉన్నాము” అని పేర్కొన్నారు.
“2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడంలో భారతదేశం యొక్క ప్రగతిలో మేము కీలక పాత్ర పోషించేందుకు కట్టుబడి ఉన్నాము. ఆర్థిక సమ్మిళితం మరియు సాధికారతను పెంపొందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాం” అని కూడా ఆయన అన్నారు.
ఎస్బీఐ కొత్త డిపాజిట్ పథకాలు ద్వారా ఎస్బీఐ కస్టమర్-సెంట్రిక్ పరిష్కారాలను అందించడంలో తన అంకితభావాన్ని మరోసారి నిరూపించుకుంటుంది.