అల్లు అర్జున్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ??

అల్లు అర్జున్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు??

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట , అల్లు అర్జున్ అభిమాని రేవతి మృతి విషయంలో అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నటుగా ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు . పుష్ప మూవీ బెనిఫిట్ షో లో జరిగిన తొక్కిసలాట గురించి తెలంగాణ అసెంబ్లీ లో MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ పై తీవ్ర ఆరోపణలు చేశారు . వీటికి కొనసాగింపుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిగిన ఘటనను వివరిస్తూ అల్లు అర్జున్ కు సినిమా థియేటర్ కు రావడానికి ఎటువంటి పేమిషన్ లేదని , పోలీస్ వారు దానిని వివరిస్తూ సాధ్య థియేటర్ యాజమాన్యానికి లేఖ రాసారని తెలిపారు .

అల్లు అర్జున్ అరెస్ట్ అయి బెయిల్ పై విడుదల ఐన తరువాత , సినీ రంగ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన ఘటనను ఉదాహరిస్తూ ” అల్లు అర్జున్ కు ఏమైనా కన్ను పోయిందా , కాలు పోయిందా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి .

అల్లు అర్జున్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు??

అసెంబ్లీ లో ప్రస్తావన , ఆరోపణల అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి , తనకు పర్మిషన్ ఇచ్చారని , తాను థియేటర్ లో ఉన్నపుడు బయట జరిగిన ఘటన తెలియదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు . తాను చేసిన కొన్ని స్టేట్మెంట్స్ ” నా క్యారెక్టర్ పై న నిందలు వేస్తున్నారు అని ” చేసిన వ్యాఖ్యలు బారి దుమారాన్ని లేపాయి .

అసెంబ్లీ ప్రెస్ మీట్ అనంతరం జరుగుతున్న పరిణామాలు చాల వేగంగా కదులుతున్నాయి . ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ నాయకులూ అల్లు అర్జున్ ను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేస్తుండగా , పోలీస్ వారు కూడా అల్లు అర్జున్ కు వ్యతిరేకం గా వ్యాఖ్యలు చేయడం , వీడియోలు రిలీజ్ చేయడం ఉత్కంఠను రేకెత్తిస్తుంది .
జరుగుతున్న పరిణామాలు , వాటి తీరును , వేగాన్ని బట్టి ఇవి అల్లు అర్జున్ ను మరింత చిక్కులులో పడేస్తాయని విశ్లేషకులు అంటున్నారు . అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ కాలం గడిచేకొద్దీ ఉత్కంఠత ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయ్

Related Posts
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీ ఖాన్
హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీ ఖాన్

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఈ Read more

ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించిన కమిషన్
ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించిన కమిషన్

తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) రిజర్వేషన్లను సమర్థంగా అమలు చేయాలనే ఉద్దేశంతో, వాటిని మూడు ఉప వర్గాలుగా విభజించాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ Read more

జనసేనకి ఈసీ మరో శుభవార్త
janasena tg

జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త అందించింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందిన జనసేన, ఇప్పుడు తెలంగాణలోనూ అధికారిక గుర్తింపు పొందింది. Read more

Sitarama Sagar: మూడేళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి : మంత్రి ఉత్తమ్
Sitarama project to be completed in three years.. Minister Uttam

Sitarama Sagar: సీతమ్మ సాగర్‌(దుమ్ముగూడెం) బ్యారేజీ నిర్మాణాన్ని మూడేళ్లలోపు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *