allu

అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటనలో నిందితుల‌కు బెయిల్!

న‌టుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్ప‌డిన ఆరుగురు నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. ఆదివారం నాడు బ‌న్నీ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేశ్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్ దాడి చేసిన విష‌యం తెలిసిందే. దాంతో ఈ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిపై బీఎన్ఎస్ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈరోజు వారిని మెజిస్ట్రేజ్ ఎదుట హాజరపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం నిందితులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా మెజిస్ట్రేజ్ వారికి బెయిల్ మంజూరు చేశారు.

ఇక నిన్న అక్రమంగా బన్నీ ఇంటి గేటులోకి ప్రవేశించి ఓయూ జేఏసీ నేతలు టమాటాలు, కోడిగుడ్లు విసిరారు. పూల కుండీల‌ను ప‌గ‌ల‌గొట్టి విధ్వంసం సృష్టించారు.

రేవ‌తి మ‌ర‌ణానికి అల్లు అర్జునే కార‌ణ‌మంటూ నినాదాలు చేసుకుంటూ ఇంటి లోప‌లికి వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు. దాంతో అల్లు అర్జున్ కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఆరుగురిని ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చారు.
పుష్ప-2 సినిమా విడుదల సందర్బంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీ తేజ గాయపడి ఆసుపత్రిలో కోలుకుంటున్న విషయం తెలుసు. ఈ కేసులో అల్లు అరెస్ట్ కావడం, బెయిల్ పై విడుదల అయ్యారు.

Related Posts
MLCగా బీజేపీ అభ్యర్థి గెలుపు
BJP income is 4,340 crores!

తెలంగాణలో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి విజయం లభించింది. కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ నియోజకవర్గానికి చెందిన టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య కైవసం చేసుకున్నారు. Read more

గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన ఉపేంద్ర ‘UI’
గ్రాండ్ గా విడుదలకు సిద్దమైన ఉపేంద్ర 'UI'

భారతీయ సినీ ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్రకు మంచి గుర్తింపు ఉంది. 90లలో ఉన్న ఉపేంద్ర సినిమాల చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కన్యాదానం, రా, Read more

పట్టాలు తప్పిన సికింద్రాబాద్-షాలిమార్ ఎక్స్‌ప్రెస్
Secunderabad Shalimar Express derailed

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. నవాల్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు Read more

సచివాలయంలో నకిలీ ఉద్యోగుల హల్ చల్
fake employees in the secre

హైదరాబాద్‌ సచివాలయంలో నకిలీ ఉద్యోగుల కలకలం రేపుతోంది. ఇటీవల వరుసగా ఫేక్ ఐడెంటిటీ కార్డులతో సచివాలయంలోకి ప్రవేశించే అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ Read more