thumbnail ayodhya

అయోధ్య రామమందిర దర్శన వేళలు పెంచుతూ నిర్ణయం

హిందూ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన వేడుకలలో మహా కుంభమేళా ఒకటి.ప్రపంచంలోని నలుమూలల హిందువులు ఈ మహా పర్వంలో పాల్గొనడం ఎంతో పవిత్రమైన అనుభూతిగా భావిస్తారు.2024 జనవరిలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఈ మహా కుంభమేళా ప్రారంభం కానుంది.ఫిబ్రవరి 26 వరకు, 45 రోజుల పాటు జరిగే ఈ గ్రాండ్ ఈవెంట్‌ కోసం ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులు కుంభమేళాకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుండటంతో, యోగి సర్కార్ భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు సజావుగా జరగేలా చూస్తోంది.ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మరొక విశేషం అయోధ్య రామమందిరం.రామమందిర ప్రారంభోత్సవం తర్వాత తొలిసారిగా కుంభమేళా జరగబోతుండటంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ రామ మందిర దర్శన వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభమేళా భద్రత కోసం భారీ స్థాయిలో చర్యలు తీసుకున్నారు.

ayodhya ram
ayodhya ram

పారా మిలిటరీ బలగాలు, 50 వేల మంది భద్రతా సిబ్బందితో పాటు, అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన 2700 కెమెరాలు నిఘాను అమలు చేస్తున్నారు.ఈసారి తొలిసారిగా అండర్ వాటర్ డ్రోన్లను కూడా వినియోగిస్తున్నారు.భక్తుల సౌకర్యార్థం మహా కుంభ్ నగర్‌ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. వసతి కోసం వేల సంఖ్యలో టెంట్లు,షెల్టర్లు అందుబాటులో ఉంచారు. ఈ మహానగరాన్ని గూగుల్ మ్యాప్‌తో అనుసంధానించి, భక్తులకు లోకేషన్ సమాచారం అందిస్తున్నారు. ఇంకా, తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసి, అత్యవసర చికిత్స కోసం ఒకేసారి 200 మందికి సేవలు అందించగల బీష్మ క్యూబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.భక్తుల సందేహాలను నివృత్తి చేయడం కోసం 11 భారతీయ భాషల్లో ఏఐ చాట్ బాట్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కుంభమేళా గురించి మరింత సులభంగా సమాచారం అందుబాటులో ఉంటుంది.

Related Posts
కుంభమేళాకు రానున్న ప్రధాని మోదీ..ఎందుకంటే?

ప్రయాగ్‌రాజ్ ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహాకుంభమేళా సందర్భంగా పుణ్యస్నానాలు చేయడానికి అనేక మంది ఇక్కడ చేరుకున్నారు. వసంత పంచమి రోజున రద్దీ Read more

నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయం
Sabarimala temple to be opened today

తిరువనంతపురం: నేటి నుంచి శబరిమల ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. కొద్దిరోజుల క్రితం ఆలయాన్ని మూసివేసిన పూజారులు నేడు తెరవనున్నారు. మకర విళక్కు పూజల కోసం సాయంత్రం ఐదు Read more

తిరుమల భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి
tirumala devotees

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తుల ఆరోగ్యంపై టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) కీలక సూచనలు జారీ చేసింది. ఇటీవల కాలంలో గుండె సంబంధిత ఆరోగ్య Read more

మనం ఒక గొప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం..
మనం ఒక గొప్ప దేవాలయం గురించి తెలుసుకుందాం

భారతదేశం దేవాలయాల సమృద్ధిగా ఉన్న దేశం. ఇక్కడ ప్రతి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంటుంది.అలాంటి ఆలయాల్లో ఉత్తరాఖండ్‌లోని జగేశ్వర్ ధామ్ ప్రత్యేకంగా నిలుస్తుంది.సంపదకు అధిపతిగా భావించబడే కుబేరుడి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *