It is a religious party. Konda Surekha key comments

అది ఓ మతతత్వ పార్టీ : కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ బీజేపీ పై విమర్శలు గుప్పించారు. విభజించి పాలించే మనస్తత్వం బీజేపీదని.. అది ఓ మతతత్వ పార్టీ కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని విమర్శించారు. ప్రజల అవసరాల కోసం ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఎప్పుడు పాటుపడలేదని ఆరోపించారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కులంపై ప్రశ్నిస్తున్నారని… ఆ పార్టీ నాయకులు కుల గణన ఫామ్ తీసుకుని రాహుల్ గాంధి ఇంటికి వెళ్తే.. రాహుల్ గాంధీ కులం ఏంటో అడిగితే ఆయనే చెబుతారన్నారు. గత పది సంవత్సరాలలో ప్రజలకు సమస్య చెప్పుకునే వేదిక కూడా ఉండేది కాదని మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పరిపాలన అందిస్తోందన్నారు. ఎన్నికల ముందు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని హామీ ఇచ్చామని.. ప్రగతి ఉన్నచోట ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు.

తెలంగాణ కొత్త పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వచ్చాక గాంధీ భవన్‌లో కార్యకర్తల కోసం, ప్రజల కోసం మంత్రుల ముఖాముఖి ఏర్పాటు చేయాలని, కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. గాంధీభవన్‌లో మంత్రితో ముఖాముఖి మంచి సంప్రదాయం ఇది ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. కుల గణన అంశంలో ప్రజల్లో సైతం మంచి స్పందన వచ్చిందని.. ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కుల గణన బ్రిటిష్ కాలంలో జరిగిందని.. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు సర్వే చేపడుతున్నామని స్పష్టం చేశారు.

విశ్వంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గరే కుల వివక్ష ఉందని రాహుల్ మాట్లాడారన్నారు. సామాజిక న్యాయం జరగడంలో తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలని తెలిపారు. 25 రోజుల లోపల కుల గణన సంపూర్ణంగా పూర్తి అవుతుందని.. ప్రతి ఇంటిలో ఏ కులం వారు ఎంత ఉన్నారో 56 ప్రశ్నలతో రిపోర్ట్ సిద్ధం చేస్తున్నామన్నారు. కుల గణన పూర్తయిన తర్వాత వాటి రిపోర్టు ఆధారంగా ఏ విధంగా సామాజిక న్యాయం చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు చేసిన అవినీతివాళ్ళ కలలో కనిపిస్తున్నాయి కావచ్చు అందుకే వాటి గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Related Posts
మావోయిస్టు కీలక నేత లొంగుబాటు..!
Surrender of a key Maoist leader..!

లొంగుబాటుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ హైదరాబాద్‌: కేంద్ర రాష్ట్ర నిర్భందాలు పెరిగిన ఎన్ కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టులకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎన్ Read more

లడ్డూ మహోత్సవంలో విషాదం.. ఏడుగురు మృతి
7 Dead, Over 50 Injured After Wooden Stage Collapses During 'Laddu Mahotsav' in UP's Baghpat

ఉత్తరప్రదేశ్‌: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మంగళ వారం రోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. బాగ్‌పత్‌ లో ఆదినాథుడి ఆలయంలో నిర్వహిస్తున్న నిర్వాణ లడ్డూ ఉత్సవంలో ఒక్కసారిగా Read more

ఈ రోజు సాయంత్రం ఢిల్లీ సీఎం పేరు ప్రకటన..
The name of Delhi CM will be announced this evening

న్యూఢిల్లీ: ఈ రోజు సాయంత్రం ఢిల్లీ సీఎం పేరు ప్రకటన.ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరనే విషయానికి బుధవారం తెరపడనుంది. బుధవారం మధ్యాహ్నం బీజేఎల్పీ సమావేశం కానుంది. దీంతో Read more

నేడు ప్రధాని మోడీతో సమావేశం కానున్న పవన్‌ కల్యాణ్
BJP protests in Telangana from 30th of this month 1

న్యూఢిల్లీ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది. నిన్న వరుసగా పలువురు కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతితో భేటీ అయిన విషయం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *