atul subhash2 1733912740

అతుల్ ఆత్మహత్య కేసులో సుప్రీంకోర్ట్ విచారం

ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ కేసు తీవ్ర సంచలనంగా మారింది. ఈ కేసుకింద నమోదయినా సెక్షన్ 498ఏపై చర్చకు దారితీసింది. ఈ సెక్షన్ దుర్వినియోగంపై స్వయంగా సుప్రీంకోర్టే ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి అతుల్ లాయర్ దినేశ్ మిశ్రా కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. కుటుంబ న్యాయస్థానం ఆదేశాలతో సంతృప్తి చెందకపోతే ఆశ్రయించేందుకు మరిన్ని ఫోరమ్‌లు ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అతుల్ ఆత్మహత్యపై అడ్వకేట్ ఆన్ రికార్డ్ (ఏవోఆర్) నిశాంత్ కేఆర్.శ్రీవాస్తవ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు కఠినమైన, సుదీర్ఘ న్యాయవిచారణ, ఆలస్యమైన న్యాయవిధానం వంటివి ఇటువంటి ఘటనలకు కారణమవుతున్నట్టు అభిప్రాయపడ్డారు. వరకట్న వేధింపులకు సంబంధించిన సెక్షన్ 498ఏ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని క్రిమినల్ లాయర్ వికాశ్ పహ్వా తెలిపారు. అతుల్ కేసును ఆయన ‘చాలా తీవ్రమైనది’గా అభివర్ణించారు.
భార్యాభర్తలిద్దరూ ఆర్థికంగా స్థిరపడినవారేనని, అతుల్ భార్య ఢిల్లీలో బాగానే సంపాదిస్తోందని, బెంగళూరులో అతుల్ నెలకు రూ. 84 వేలు సంపాదిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే, కుమారుడి పోషణ కోసం నెలకు రూ. 40 వేలు చెల్లించాలని అతుల్‌ను కుటుంబ న్యాయస్థానం ఆదేశించినట్టు తెలిపారు. మిగతా రూ. 44 వేలతో అతుల్ బెంగళూరులో అద్దెలు కట్టుకుని, కుటుంబాన్ని పోషించుకోవడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఆమె బాగా సంపాదించి, స్థిరపడి ఉన్నందున విడిపోయిన భార్యకు భరణం చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించలేదని లాయర్ దినేశ్ మిశ్రా తెలిపారు. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలపై అతుల్ సంతృప్తి చెందకుంటే పై కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు.
ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత వుంది. కింది కోర్టులు సంతృప్తి తీర్పులు ఇవ్వనపుడు పైకోర్టులను ఆశ్రయి చవచ్చు అని సుప్రీంకోర్టు తెలిపింది.

Related Posts
ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు
ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు

ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతంపై దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను మార్చి Read more

ట్రంప్‌తో భేటీలో ప్రధాని హుందాగా నడుచుకున్నారు: శశిథరూర్
PM behaved soberly in meeting with Trump.. Shashi Tharoor

అమెరికా విధించే టారిఫ్‌పై తొందరపడకూడదన్న శశిథరూర్ న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో Read more

ట్రంప్ ప్రకటనను ఖండించిన హమాస్..
ట్రంప్ ప్రకటనను ఖండించిన హమాస్..

అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్, తాజాగా చేసిన ఒక ప్రకటనతో మరోసారి వివాదాస్పదంగా మారాడు. Read more

దేశంలోనే తొలిసారి.. మహిళలతోనే ప్రధానికి భద్రత
For the first time in the country, the Prime Minister will be provided security with women

న్యూఢిల్లీ : రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా గుజరాత్‌ లోని నవ్‌సారీ జిల్లాలో నిర్వహించబోయే ఉమెన్స్‌ డే వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *