Tensions between YSRCP TDP.Former minister Appalaraju under house arrest

వైఎస్‌ఆర్‌సీపీ-టీడీపీ మధ్య ఉద్రికత్తలు..మాజీ మంత్రి అప్పలరాజు గృహ నిర్బంధం

అమరావతి: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ-పలాసలో వైస్‌ఆర్‌సీపీ మరియు టీడీపీ నేతల మధ్య జరిగిన గొడవలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. దీంతో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. బాలికపై తెలుగుయువత పాలస అధ్యక్షుడు ఢిల్లీ రావు దాడి చేశారని ఆరోపణలు రావడంతో, పోలీసులు టీడీపీ కార్యకర్తలపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి చేసిన నేపథ్యంలో పలాసలో శనివారం రాత్రి నుంచే పరిస్థితులు ఉత్కంఠంగా మారాయి.

అయితే దాడులపై పోలీసులు హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అప్పలరాజు నిన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో, అక్కడే ఉన్న కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్డుపై బైఠాయించారు. ఇది పరిస్థితులను మరింత ఉద్రిక్తం చేసింది. అయితే, నిందితులపై చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. ఆ తర్వాత, అప్పలరాజు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన వారిపై తక్షణమే కేసులు నమోదు చేయకుంటే పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఇకపోతే..పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కేటీరోడ్డులో శనివారం రాత్రి వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీడీపీకి చెందిన కొర్ల విష్ణుపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త అల్లు రమణ దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. విష్ణు కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, టీడీపీ కార్యకర్తలు అక్కడ చేరుకున్నారు. ఈ సమయంలో రమణతో పాటు మాజీ మంత్రి అప్పలరాజు అనుచరుడు మన్మథరావుపై కూడా దాడి జరిగింది. దీనిపై కానిస్టేబుల్ నారాయణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నలుగురితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్టు సీఐ మోహన్‌రావు తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్త రమణ నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన చెప్పారు.

Related Posts
రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మూడవ ఎడిషన్ ప్రారంభం
Royal Stag Boombox launched their third edition in Hyderabad

హైదరాబాద్ : ‘లివింగ్ ఇట్ లార్జ్’ యొక్క స్ఫూర్తిని సంబరం చేస్తూ, సీగ్రామ్ రాయల్ స్టాగ్ హైదరాబాద్, తెలంగాణాలో బౌల్డర్ హిల్స్ లో జనవరి 25న గొప్ప Read more

తెలంగాణలో మరో 2 IIITలు?
2 more IIITs in Telangana

బాసరలోని RGUKT (Rajiv Gandhi University of Knowledge Technologies) కి అనుబంధంగా మరో రెండు IIITలను ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యా Read more

Banana Farmers : అరటి రైతులకు రూ.1.10 లక్షలు – అచ్చెన్న
banana farmers

ఆంధ్రప్రదేశ్‌లో వడగండ్ల వర్షాలతో భారీగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు Read more

ఓటమి నుంచి నేర్చుకొని ముందుకు సాగుతాం: ప్రియాంకా గాంధీ
Let learn from defeat and move forward ..Priyanka Gandhi

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, Read more