Another encounter in Jammu and Kashmir 1

లార్నూ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. ఆపరేషన్‌లో భాగంగా అనంతనాగ్‌ లోని లార్నూ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు శనివారం నాడు మట్టుబెట్టాయి. అనంతనాగ్ ఆర్మీ జవాన్ హిలాల్ అహ్మద్ భట్‌ హత్య ఘటనలో ఈ ఇద్దరు ఉగ్రవాదులకు ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. భట్ గత అక్టోబర్ మొదటి వారంలో అపహరణకు గరయ్యాడు. ఆ తర్వాత బుల్లెట్లతో ఛిద్రమైన అతని మృతదేహాన్ని బలగాలు కనుగొన్నాయి. కాగా, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు ఇండియన్ ఆర్మీ ధ్రువీకరించింది. హల్కాన్ గలిలో ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో బలగాలు గాలింపు ముమ్మరం చేశాయని, ఇది గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు తీవ్రంగా ప్రతిఘటించాయని తెలిపింది.

ఇద్దరు ఉగ్రవాదులను సమర్ధవంతంగా మన బలగాలు మట్టుబెట్టాయని, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వివరించింది. కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల్లో ఒకరిని విదేశీయుడిగా, ఒకరిని స్థానికుడిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వీరికి ఏ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే దానిని ఇంకా నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. అనంతనాగ్‌లో ఎన్‌కౌంటర్ జరిగిన గంట తరువాత శ్రీనగర్ సిటీలోనూ అదే తరహా ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. బలగాల ఉచ్చులో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకున్నట్టు తాజా సమాచారం. శ్రీనగర్‌లో గత 30 నెలల తర్వాత ఎన్‌కౌంటర్ ఘటన చోటుచేసుకోడవం ఇదే మొదటిసారి. చివరిసారిగా 2022 ఏప్రిల్‌లో బిషంబర్ నగర్ ఏరియాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.

Related Posts
Nitish Kumar: నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌!
Nitish Kumar నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌

Nitish Kumar: నితీశ్ కుమార్‌ను రాజీనామా చేయాల‌ని తేజ‌స్వీ యాద‌వ్ డిమాండ్‌! బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదాస్పదంగా మారారు. ఆయన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో Read more

తెలంగాణలో 8 కులాల పేర్ల మార్పు.. నోటిఫికేషన్‌ జారీ
Change of names of 8 castes in Telangana.. Notification issued

హైదరాబాద్‌: కులం పేర్లను ఇప్పటికీ , తిట్లగా ఉపయోగిస్తున్నారు. సినిమాలు, రాజకీయాల వేదికలపై కొన్ని కులాల పేర్లు మనస్సుని బాధించేలా, అవమాన కరంగా వాడబడుతున్నాయి. ఈ విషయం Read more

సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
Justice Sanjiv Khanna sworn in as CJI

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాఈరోజు( సోమవారం) ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి Read more

రన్యరావు దాడిపై స్పందించిన కర్ణాటక మహిళ చైర్ పర్సన్
స్మగ్లింగ్ కేసులో రన్య రావు – ఆమెపై జరిగిన దాడికి స్పందించిన మహిళా కమిషన్!

కన్నడ నటి రన్య రావును బంగారం అక్రమ రవాణా కేసులో బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె విచారణలో కీలక విషయాలు బయటకు Read more