చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

లంచం, మోసం ఆరోపణలు..గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు..!

న్యూయార్క్‌: భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత, ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్‌లో కేసు నమోదైంది. మల్టీబిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురు ఈ స్కీంలో నిందితులుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థలు రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ నవంబర్ 21న నివేదించాయి. సోలార్ ఎనర్జీ కాంట్రాక్టుల్ని దక్కించుకునేందుకు ఈ క్రమంలోనే అదానీ గ్రూప్.. భారత ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలు ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. ఇటీవల గౌతమ్ అదానీ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.

Advertisements

ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై అక్కడ కేసు నమోదవడం చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌కు అభినందనలు తెలిపిన తర్వాత అదానీ.. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడుల్ని ప్రకటించినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇటీవల ట్రంప్ ఎనర్జీ కంపెనీలకు నిబంధనల్ని సడలించనున్నట్లు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరు 20 సంవత్సరాలలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందే అవకాశం ఉన్న.. సౌరశక్తి సరఫరా ఒప్పందాల్ని పొందేందుకు భారత అధికారులకు .. 265 మిలియన్ డాలర్ల మేర లంచాలు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీలో.. అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ పెట్టుబడిదారులు, రుణ దాతల నుంచి సుమారు 3 బిలియన్ డాలర్లకుపైగా రుణాలు, బాండ్లు సేకరించిందని అభియోగాలు నమోదయ్యాయి.

యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ ప్రకారం అదానీ.. అమెరికన్ ఇన్వెస్టర్లను మోసగించారని, అధికారులకు లంచాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అదానీతో పాటుగా ఇందులో అదానీ గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ అయిన ఆయన అల్లుడు సాగర్ అదానీ (30), అజూర్ పవర్ గ్లోబల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ సిరిల్ క్యాబెన్స్ ప్రముఖంగా ఉన్నట్లు తెలిసింది. తప్పుడు స్టేట్‌మెంట్లు, ప్రకటనల ద్వారా లబ్ధి పొందినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఫారెన్ బిజినెస్ డీలింగ్స్ కింద అమెరికాలో ఉన్న ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అభియోగాలు నమోదు చేశారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్, రంజిత్ గుప్తా, సిరిల్ క్యాబెన్స్, సౌరభ్ అగర్వాల్, దీపక్ మల్హోత్రా రూపేశ్ అగర్వాల్ వంటి వారిపై కేసులు నమోదయ్యాయి.

Related Posts
మహారాష్ట్ర గడ్డపై గబ్బర్ సింగ్ వార్నింగ్
pawan warning

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన స్పీచ్ తో అదరగొట్టారు. శనివారం డేగ్లూర్ బహిరంగ సభకు పవన్ Read more

రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు ఎమ్మార్పీఎస్ పిలుపు
MMRPS calls for protests ac

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ విమర్శలు గుప్పించారు. మాలలకు అనుకూలంగా Read more

పదేండ్ల కేసీఆర్‌ పాలనలో సుభిక్షంగా మారిన తెలంగాణ !
Telangana became prosperous under KCR rule for ten years!

వారి విమర్శలు ఉత్తవేనని ఈ లెక్కలు తేల్చియి హైదరాబాద్: ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన రాష్ట్ర గణాంక నివేదిక-2024(అట్లాస్‌) పదేండ్ల కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం సాధించిన అభివృద్ధికి Read more

వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల
Minister Payyavula introduced the annual budget in the assembly

బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48వేల కోట్లు అమరావతి: ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్‌ను సభ Read more

Advertisements
×