formers

రైతుభరోసా పరిమితి, మార్గదర్శకాలు

రైతులకు తమ ప్రభుత్వం మేలుచేస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఆ దిశగా చర్చలను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా రైతు భరోసా అర్హత .. పరిమితి పైన మంత్రివర్గ ఉప సంఘం సుదీర్ఘంగా చర్చించింది. సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలనే ప్రతిపాదనకు దాదాపు ఆమోదం లభించింది. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశం పై సుదీర్ఘంగా చర్చించింది. సంక్రాంతికి రైతుభరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisements
rythu bharosa telangana

కీలక ప్రతిపాదనలు
ఐటీ చెల్లిస్తున్న వారిలో ఎవరికి మినహాయింపు ఇవ్వాలి.. ఎవరిని కొనసాగించాలి అనే అంశం పైన కీలక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపు దారులు అందరినీ పథకం నుంచి మినహాయిస్తే సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అయింది.
20 లక్షల మంది కి కోత?
గత ప్రభుత్వ హయాంలో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చారు. ప్రభుత్వం సాగు భూములకే ఇవ్వాలని నిర్ణయిస్తే దాదాపు 20 లక్షల మంది కి కోత పడే అవకాశం ఉందని అంచనా.

జనవరి తొలి వారంలోనే విధి విధానాలు పూర్తి చేసి.. మార్గదర్శకాలు ప్రకటించాలని భావిస్తున్నారు. సంక్రాంతికి నిధులు విడుదల చేసే విషయానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

వీరికి మినహాయింపు
వారికి మినహాయింపు పీఎం – కిసాన్ లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు, వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించినవారు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులకు పథకం అమలు చేయటం లేదు. ఇదే విధంగా ఈ వర్గాలను అమలుకు దూరంగా ఉంచాలంటే వచ్చే ఇబ్బందుల పైనా చర్చ జరిగింది.

ఈ పథకం అమల్లో భాగంగా మొత్తంగా రూ 80,453 కోట్లు చెల్లించగా.. ఇందులో సాగు భూముల కోసం రూ 21,284 కోట్లు చెల్లించారని అధికారులు నివేదిక ఇచ్చారు.

Related Posts
నేడు బెంగళూరుకు వెళ్లనున్న హైడ్రా బృందం
Hydra team going to Bangalore today

హైదరాబాద్‌: హైడ్రా బృందం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు బెంగళూరుకు హైడ్రా బృందం వెళ్లనుంది. ఈ మేరకు రెండు రోజుల పాటు హైడ్రా బెంగళూరులో పర్యటించనుంది. బెంగళూరులో Read more

పిల్లల థియేటర్ టైమింగ్స్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
పిల్లల థియేటర్ టైమింగ్స్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

సినిమాల ప్రీమియం షోలు, స్పెషల్ షోల కారణంగా పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, 16 ఏళ్లలోపు పిల్లల కోసం సినిమా థియేటర్లపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు Read more

నీటి వనరులను దెబ్బతీస్తున్న వరి సాగు
నీటి వనరులను దెబ్బతీస్తున్న వరి సాగు

యాసంగి సమయంలో కూడా ఇతర పంటల సాగు కంటే వరి సాగుకు ప్రాధాన్యత ఇవ్వడంతో, రాష్ట్రం తన విలువైన నీటి వనరులపై ఎక్కువగా ఆధారపడుతోంది. నేరుగా సాగు Read more

కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల : పొంగులేటి
Minister Ponguleti Srinivasa Reddy who started the Indiramma houses in Kusumanchi

హైదరాబాద్‌: రాష్ట గృహ నిర్మాణ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం కుసుమంచిలో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇళ్లును ఇవాళ(సోమవారం) ప్రారంభించారు. ఈ Read more

Advertisements
×