Government is fully responsible for this incident: Harish Rao

రేవంత్ మొస‌లి క‌న్నీరు – హరీష్

రైతులు సంతోషంగా ఉంటే బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్రపట్టడం లేదని , స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా? అని ప్ర‌శ్నించారు. రుణమాఫీపై చర్చకు కేసీఆర్‌, మోడీ సిద్ధమా? ఏడాదిలోనే 25 లక్షల రైతుల కుటుంబాలకు 21 వేల కోట్ల రుణమాఫీ చేసిన రాష్ట్రం ఉందా? రైతు రుణమాఫీ చేసిన చ‌రిత్ర త‌మ‌దేన‌ని స్ప‌ష్టం చేశారు. కాళేశ్వ‌రం క‌ట్టిన అన్న‌డు, పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల చేప‌ట్టిన అన్నాడు.

కేవ‌లం సాగునీటి ప్రాజెక్టుల కోసం ల‌క్షా ఎన‌భైమూడు వేల కోట్లు ఖ‌ర్చు పెట్టాడ‌న్నారు. కాళేశ్వ‌రానికే ల‌క్షా రెండువేల కోట్లు ఖ‌ర్చు చేశార‌న్నారు. అన్ని కోట్లు ఖ‌ర్చు చేసిన ప్రాజెక్టులు కుప్ప‌కూలిపోయి చుక్క‌నీరు లిఫ్ట్ చేయ‌క‌పోయినా కాంగ్రెస్ హ‌యాంలో క‌ట్టిన మంజీర‌, కోయిలసాగ‌ర్, శ్రీరాంసాగ‌ర్, ఎల్లంప‌ల్లిలాంటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి ఈ సంవ‌త్స‌రం లేక‌పోయినా 1 కోటి 53 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల వ‌రి పండించామ‌ని మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరుగుతున్న రైతు పండగ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు.

ఈ మాటలపై హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.రేవంత్ రెడ్డి మ‌రోసారి మాయమాటలతో రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే రైతులపై ప్రేమ కంటే, గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆవేదనే కనిపించింద‌ని అన్నారు. మహబూబ్ నగర్ రైతు పండుగలో రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎంత మొత్తుకున్నా దండుగే అయ్యింది. ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరు మనిపించింది. ఏడాది పూర్తయిన సందర్భంగానైనా రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు ఈ యాసంగికి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలుపుకొని ఎకరాకు 15వేలు ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చెయ్యి చూపారు.

ఇక కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతు బంధుకు అతీగతీ లేదు. రైతు పండుగ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేసారు. కేసీఆర్ ప్రారంభించిన రైతుబీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అంటూ గప్పాలు కొట్టుకోవడం సిగ్గుచేటు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదు, మా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే కోటి 53 లక్షల టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉందని హరీష్ రావు పేర్కొన్నారు.

Related Posts
కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం
Srivari's Kalyanaratham leaving for Prayagraj Kumbh Mela

తిరుమల: ప్రముఖ్య పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణరథం బయలుదేరింది. కల్యాణ రథంకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం Read more

తెలంగాణ, మహారాష్ట్రపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ, మహారాష్ట్రపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి వేదికను Read more

Gummadi Narsaiah : గుమ్మడి నర్సయ్యకు అవమానం పై సీఎం రేవంత్ క్లారిటీ
cm revanth

తెలంగాణ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని గతంలో ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అవకాశం దొరకలేదని, తాను Read more

ఆర్టీసీలోకి 3వేల ఎలక్ట్రిక్ బస్సులు – సీఎం రేవంత్
electric buses telangana

తెలంగాణలో పర్యావరణహిత రవాణాకు ప్రాధాన్యత ఇస్తూ, త్వరలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇప్పటికే దేశవ్యాప్తంగా Read more