kishan reddy warning

రామప్ప, సోమశిలకు రూ.142 కోట్లు కేటాయింపు – కిషన్ రెడ్డి

యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ‘స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌/యూనియన్‌ టెరిటరిస్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌(సాస్కి)’ పథకం కింద ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనుంది. ఇందుకు సంబంధించి 23 రాష్ట్రాల్లోని 40 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం రూ.3,295.76 కోట్ల నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వనుంది. 50 ఏళ్ల కాలవ్యవధితో వడ్డీ రహిత రుణాల రూపంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ నిధులను విడుదల చేస్తుంది.

Advertisements

ఇందులో తెలంగాణ నుంచి రెండు ప్రాంతాలను ఎంపిక చేశారు. సస్టెయినబుల్ టూరిజం సర్క్యూట్ కింద రూ.74 కోట్లతో రామప్ప ఏరియా, వెల్ నెస్ అండ్ స్పిరిచువల్ రిట్రీట్ నల్లమల కింద రూ.68 కోట్లతో సోమశిల ఏరియాను అభివృద్ధి చేయనున్నారు. ప్రజల ఆదరణ పొందిన ఆయా పర్యాటక ప్రాంతాలలో రద్దీని తగ్గించడం, అధునాతన సాంకేతికతలను సమర్థవంతంగా ఉపయోగించడం, స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, సందర్శకుల అనుభవాలను మెరుగుపరచడానికి ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వరకు, భారతదేశ సహజమైన సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటేలా ప్రతి ఒక్కరికీ ప్రపంచ స్థాయి అనుభవాన్ని అందించడానికి అనేక రకాల చర్యలను చేపట్టనున్నారు.

ఈ విషయాన్నీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.రాష్ట్రంలోని ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప, సోమశిల పర్యాటక సర్క్యూట్‌ ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం రూ.141.84 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. సాస్కి(స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌, యూనియన్‌ టెరిటోరిస్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వె్‌స్టమెంట్‌) పథకం కింద ఈ నిధులను మంజూరు చేసినట్టు వెల్లడించారు.

Related Posts
Telangana Budget 2025-26 : శాఖల వారిగా కేటాయింపులు ఇలా !
Telangana Budget 2025 26

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. అనంతరం, అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క Read more

Amaravati: అమరావతి అభివృద్ధికి రూ.4200 కోట్లు విడుదల చేసిన కేంద్రం
Amaravati: అమరావతి అభివృద్ధికి రూ.4200 కోట్లు విడుదల చేసిన కేంద్రం

అభివృద్ధి దిశగా అమరావతికి కేంద్రం బలమైన మద్దతు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.4200 కోట్ల నిధులను విడుదల చేయడం ద్వారా అమరావతి నిర్మాణానికి ఊహించని ఊపిరి పోసింది. Read more

PM Modi : నా బాల్యమంతా తీవ్ర పేదరికంలోనే – ప్రధాని మోడీ
65926203ef220 658ebbd43f501 narendra modi 293010843 16x9 302009432 16x9

భారత ప్రధాని నరేంద్ర మోదీ తన బాల్య జీవితాన్ని తీవ్ర పేదరికంలో గడిపినప్పటికీ, ఆ పరిస్థితిని ఎప్పుడూ బాధగా అనుకోలేదని వెల్లడించారు. ప్రముఖ పోడ్‌కాస్ట్ "లెక్స్ ఫ్రిడ్మ్యాన్ Read more

HCU : కంచ గచ్చిబౌలి భూమి వివాదంపై ప్రభుత్వం కీలక నిర్ణయం
hcu deers

తెలంగాణలో కలకలం రేపుతున్న రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సుప్రీంకోర్టు మధ్యలోకి రావడంతో, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని Read more

Advertisements
×