ap high court

రఘురామ కేసులో ప్రభావతికి షాకిచ్చిన హైకోర్టు

కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక వైసీపీ నాయకులపై అక్రమ కేసులను మోపుతున్నది. తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారంలో డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ ప్రభావతి వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో జిల్లా సెషన్స్ కోర్టు కూడా ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం నర్సాపురం ఎంపీగా ఉన్న సమయంలో రఘురామపై థర్డ్‌ డిగ్రీని ప్రయోగించిన కేసులో గుంటూరు ప్రభుత్వాస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ముందుగా జిల్లా సెషన్స్‌కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ కోసం ఆశ్రయించగా.. అందుకు కోర్టు నిరాకరించింది. దీంతో ప్రభావతి హైకోర్టులో పిటిషన్ వేశారు.

Advertisements

అయితే హైకోర్టుకు కూడా ప్రభావతి పిటిషన్‌ను కొట్టివేసింది. కస్టోడియల్ టార్చర్ అనంతరం సంబంధిత డాక్టర్లు రఘురామకు దెబ్బలు తగిలాయని నివేదికలు ఇచ్చారు. అయితే ప్రభావతి ఆ నివేదికను మార్చి.. ఆయనకు ఎటువంటి గాయాలు అవలేదని నివేదిక ఇచ్చారని పోలీసులు అభియోగం మోపారు.

ఈ కేసుకు సంబంధించి రఘురామ.. గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయగా నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రభావతి, విజయపాల్, తులసిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్, అప్పటి ఇంటలిజెన్స్ బాస్‌గా ఉన్న పీఎస్‌ఆర్ ఆంజనేయులు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా నిందితులుగా ఉన్నారు. అయితే వాళ్లు ముగ్గురు కూడా ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టుకు వెళ్లలేదు.

Related Posts
అప్పుడు రయ్ రయ్.. ఇప్పుడు నై నై అంటే ఎలా చంద్రబాబు? – వైసీపీ
ఉగాదికి మహిళల ఉచిత బస్సు ప్రయాణం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై టీడీపీ , వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా టీడీపీ సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు గతంలో Read more

మహిళపై మాజీ మంత్రి అనుచరుడు లైంగిక దాడి
The girl was raped.. The vi

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై రాజకీయ నేతల అనుచరుల వేధింపులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనుచరుడైన Read more

Chandrababu: విజయదశమి సందర్భంగా దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు: చంద్రబాబు
chandrababu

రేపు అక్టోబరు 12న దసరా పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా Read more

Viveka : వివేకా హత్య కేసు నిందితులకు త్వరలో సినిమా – ఆదినారాయణ రెడ్డి
adhi narayana

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) Read more

×