supreme court upholds validity of up madrasa education act

యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ బద్ధతను సమర్ధించిన సుప్రీంకోర్టు

లక్నో: యూపీ మదర్సా చట్టం చట్టబద్ధమైనదా లేదా చట్టవిరుద్ధమైనదా.. ఈ అంశంపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. గతంలో అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. యపీలో మదర్సా చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు దానిని రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు.. యూపీ మదర్సా చట్టానికి గుర్తింపు ఇచ్చింది. యూపీ మదర్సా చట్టం రాజ్యాంగ బద్ధతను సుప్రీంకోర్టు సమర్ధించింది. తాజా సుప్రీంకోర్టు తీర్పుతో యూపీలోని మదర్సాల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. మదర్సా చట్టంపై ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, జస్టిస్ జేబి పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. సుప్రీం తీర్పుతో యూపీలోని 16వేల మదర్సాలకు ఊరట లభించింది. మదర్సాల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగనున్నాయి.

Advertisements

అక్టోబర్ 22న విచారణ పూర్తయిన తరువాత సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. అయితే, విచారణ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. ఫాజిల్, కమిల్ ఆధ్వర్యంలో డిగ్రీలు పట్టాలు ఇచ్చే హక్కు రాష్ట్ర పరిధిలో లేదని, ఇది యూజీసీ చట్టంలో నిబంధనలను ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. అన్ని మదర్సాలు 12వ తరగతి వరకు సర్టిఫికెట్లు ఇవ్వవచ్చునని.. అయితే, అంతకు మించి విద్యార్హత సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం మదర్సాలకు లేదని సుప్రీంకోర్టు తన నిర్ణయంలో పేర్కొంది. అంటే.. యూపీ మదర్సా బోర్డు గుర్తించిన మదర్సాలు యూజీసీ చట్టానికి విరుద్దం కాబట్టి విద్యార్థులకు కమిటి, ఫాజిల్ డిగ్రీలు ఇవ్వలేవు.

Related Posts
భారత్‌కు వ్యతిరేకంగా పాక్ , చైనా కుమ్మక్కు : ఆర్మీ చీఫ్
Pakistan, China colluding against India.. Army Chief

న్యూఢిల్లీ: చైనా, పాకిస్థాన్‌లు భారత్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కవుతున్నాయని సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండింటి మధ్య ఉన్న కుట్రపూరిత సంబంధాలున్నాయన్న వాస్తవాన్ని Read more

టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వాసిరెడ్డి పద్మ
టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వాసిరెడ్డి పద్మ

ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ త్వరలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. వైసీపీకి రాజీనామా చేసిన ఆమె, విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిని Read more

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

పార్లమెంటులో జరిగిన సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ బిల్లు కు ఆమోదం లభించింది.దేశంలో ముస్లిం మైనారిటీల ఆస్తుల పరిరక్షణ కోసం రూపొందించిన వక్ఫ్ బిల్లుపై మొదటగా లోక్‌సభలో Read more

Priest Suicide:ఆలయమే అతని ప్రాణం చివరకి ఏమైంది
Priest Suicide:ఆలయమే అతని ప్రాణం చివరకి ఏమైంది

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ఆలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ పూజారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. డెవలప్‌మెంట్ పేరుతో ఆలయాన్ని తొలగించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, Read more

×