కూల్‌డ్రింక్‌లో విషం కలిపి బాయ్‌ఫ్రెండ్‌ను గ్రీష్మ

యువతికి ఉరిశిక్ష . కోర్టు తీర్పు..ఎందుకంటే?

తిరువనంతపురం కోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. బాయ్‌ఫ్రెండ్ షారన్ రాజ్‌ను చంపిన కేసులో ప్రధాన నిందితురాలు గ్రీష్మకు మరణశిక్షను ఖరారు చేసింది. 2022లో జరిగిన ఈ హత్యకేసు కేరళలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.గత సంవత్సరం అక్టోబర్ 14న గ్రీష్మ తన పుట్టినరోజు సందర్భంలో షారన్‌ను తన ఇంటికి పిలిచింది. అతడికి హెర్బిసైడ్ (పారాక్వాట్) కలిపిన డ్రింక్ ఇచ్చింది. దీనివల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న షారన్, 11 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అక్టోబర్ 25న అతడు తుదిశ్వాస విడిచాడు. కేసు విచారణలో కేరళ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. గ్రీష్మ చేసిన చాట్స్, షారన్ వైద్య రికార్డులు, ఫోరెన్సిక్ నివేదికలు నేరాన్ని నిర్ధారించాయి.

Advertisements
crime
crime

గ్రీష్మ షారన్‌తో ప్రేమలో ఉన్నప్పటికీ, ఇతర వ్యక్తిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. షారన్ ఈ విషయం అంగీకరించకపోవడంతో, అతన్ని హతమార్చేందుకు పథకం రచించింది.కోర్టు తన తీర్పులో గ్రీష్మ నేరం అరుదైనది, గర్భించలేని రకం అని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తి ఏఎం బషీర్ గ్రీష్మకు మరణశిక్షను ఖరారు చేశారు. అలాగే, గ్రీష్మకు సహకరించిన ఆమె మామ నిర్మలకుమారన్ నాయర్‌కు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించారు.

అయితే గ్రీష్మ తల్లి సింధుపై నేరానికి ఆధారాలు లేకపోవడంతో ఆమెను విడుదల చేశారు.న్యాయమూర్తి ఈ తీర్పు సమాజానికి గుణపాఠంగా ఉండాలని తెలిపారు.ప్రేమ పేరుతో జరిగిన మోసానికి, హింసకు ఇది దారుణమైన ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు.తీర్పు ప్రకటన సమయంలో గ్రీష్మ ఎలాంటి భావోద్వేగం చూపించలేదని మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ కేసులో వేగవంతమైన దర్యాప్తు, న్యాయ నిర్ణయం కోసం పనిచేసిన పోలీసు బృందంపై కోర్టు ప్రశంసలు కురిపించింది.ఈ తీర్పు న్యాయం ఉండేలా తీసుకోవాలని కేరళలో చర్చ కొనసాగుతోంది. మోసం, నేరాలకు ఈ తీర్పు బలమైన హెచ్చరికగా నిలిచింది.బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమ పేరుతో మోసం చేసి హత్య చేసిన గ్రీష్మకు గవర్నర్ నుంచి గడువునిచ్చే అవకాశాలు కనిపించకపోవడంతో ఆమెకు ఉరి శిక్ష అమలు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Posts
శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి
Srinivas Gowda as Chief Adviser of Goa State OBC

హైదరాబాద్‌: బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ కు గోవాలో కీలక పదవి దక్కింది. రాష్ట్రీయ ఓబీసీ మహాసంగ్ – గోవా రాష్ట్ర ఓబిసి చీఫ్ అడ్వైజర్ గా Read more

పాకిస్తాన్‌కు దేశ భద్రతా సమాచారాన్ని ఇచ్చిన కార్మికుడు అరెస్ట్
india infoleak

గుజరాత్‌లోని దేవభూమి ద్వార్కా జిల్లాలో ఒక కార్మికుడు పాకిస్తానీ ఏజెంట్‌కు సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు ఇటీవల గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) అంగీకరించింది ఆ వ్యక్తి, Read more

డిసెంబరు 6న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 16వ వార్షిక రక్తదాన శిబిరాలు
HDFC Bank BLOOD DONATION

డిసెంబరు 2024: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, తన ఫ్లాగ్‌షిప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం పరివర్తన్‌లో భాగంగా తన దేశవ్యాప్త Read more

Donald Trump: భారత ఐటీ రంగంపై ట్రంప్ పిడుగు..కోలుకొని దెబ్బే
రెండు దేశాలమధ్య ఉద్రిక్తత భావాలు వద్దంటున్నా ట్రంప్

మొన్నటికి మొన్న ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను విధించారు ట్రంప్. 25 శాతం వరకు టారిఫ్‌ను పెంచారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై కిందటి నెల 31వ Read more

Advertisements
×