bjp musi nidra

మూసీ నిద్ర ప్రారంభించిన బిజెపి నేతలు..

మూసీ పరివాహక ప్రాంతాల్లో “బీజేపీ మూసీ నిద్ర” కార్యక్రమం ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయాల్లో మూసీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. మూసి సుందరీకరణ పేరుతో మూసి వాసుల ఇళ్లను కూల్చడం..అక్కడి ప్రజలను మరోచోటుకు తరలించడం పట్ల బిఆర్ఎస్ తో పాటు బిజెపి వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్న వారిని సడెన్ గా ఇక్కడి నుండి వేరే చోటికి వెళ్ళమని చెప్పడం..ఇల్లు కూల్చేస్తాం అంటే ఎలా అని వారంతా ప్రశ్నించారు. అయితే సియోల్‌ తరహాలో హైదరాబాద్‌లో మూసీని పునరుజ్జీవింపజేస్తామంటూ తెలంగాణ లోని రేవంత్ సర్కార్ చెబుతోంది. మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే బుల్జోజర్లతో తొక్కిస్తామని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

రేవంత్‌ కామెంట్స్‌కు బీజేపీ నేత, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. మూసి ప్రాంతం పేదలకు మనోధైర్యం కల్పిందేందుకు, వారికి అండగా ఉంటానని కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. సీఎం వ్యాఖ్యలను తప్పుబట్టిన కిషన్ రెడ్డి.. బుల్డోజర్లు వస్తే చావడానికైనా సిద్ధమేనని చెప్పారు. ఈ క్రమంలోనే మొన్న మూసి వద్దా నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దానికి తగినట్లుగా మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ రోజు రాత్రి అంబర్పేట్ తులసి రామ్ నగర్ మూసి పేదల నివాసం ప్రాంతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా ముఖ్యనేతలు బస్తీ నిద్ర చేసేందుకు సిద్ధమయ్యారు. మూసీ నది వెంట 21 ప్రాంతాల్లో వారు రాత్రి బస చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గం తులసీ రామ్ నగర్ లోని మూసీ ప్రాంత ప్రజలను కలిసి, వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. అనంతరం ఈ రాత్రి తులసీరామ్ నగర్ లోనే కిషన్ రెడ్డి బస చేయనున్నారు. ఆయన వెంట బీజేపీ స్పోక్స్ పర్సన్ రాణి రుద్రమ సహా ఇతర బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Related Posts
నేడు చార్మినార్‌ కు సీఎం రేవంత్‌ రెడ్డి.. భారీ బందోబస్తు ఏర్పాట్లు
cm revanth reddy district tour

హైదరాబాద్‌: ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ Read more

మణిపూర్: భద్రతా దళాలపై నిరసన
మణిపూర్: భద్రతా దళాలపై నిరసన

మణిపూర్లోని ఇంఫాల్ పశ్చిమ సరిహద్దులో ఉన్న కాంగ్పోక్పి జిల్లాలోని ఉయోక్చింగ్ వద్ద మోహరించిన భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేయడంతో శుక్రవారం సాయంత్రం మణిపూర్లోని కుకీ-ఆధిపత్య Read more

వివాదంలో రిషబ్ శెట్టి కాంతార 2
వివాదంలో రిషబ్ శెట్టి కాంతార 2

కాంతార చాప్టర్ 2 చిత్రీకరణలో భాగంగా రిషబ్ శెట్టి బృందం అడవులకు నష్టం కలిగించిందని పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతున్న Read more

కిమ్స్‌లో 100 రోబోటిక్ విప్పల్ శస్త్రచికిత్సలు
100 Robotic Whipple Surgeries in Kim's

హైదరాబాద్‌: కిమ్స్ హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఒకటి. అత్యంత క్లిష్టమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లను 100 రోబోటిక్-సహాయక విప్పల్ తోటి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసిన భారతదేశంలో Read more