నటుడు విజయ్ దేవరకొండ తన తల్లి మాధవి దేవరకొండతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నారు. పవిత్ర జలాల్లో స్నానం చేసి, ప్రత్యేక ప్రార్థనలు చేసిన విజయ్ దేవరకొండ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే, ఆయన తన తల్లితో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో దర్శనమిచ్చారు. ప్రయాగ్రాజ్కు వెళ్తుండగా కెమెరాలకు చిక్కారు. తాజాగా బయటకు వచ్చిన చిత్రాల్లో విజయ్ దేవరకొండ తెల్లటి భారీ చొక్కా, బ్యాగీ ప్యాంటుతో సింపుల్ లుక్లో కనిపించరు.

ఇకపోతే, విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రం “VD12” కోసం మాస్ లుక్లోకి మారనున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ టీజర్కు వాయిస్ ఓవర్ అందించారని సమాచారం. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 12, 2025న VD12 టీజర్ విడుదల కానుంది. 2025 మహా కుంభమేళా 144 సంవత్సరాల విరామం తర్వాత జరగనుండటంతో ఇది మరింత ప్రత్యేకంగా మారింది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరిగే ఈ వేడుకకు కోట్లాది మంది భక్తులు హాజరవుతున్నారు.
విజయ్ దేవరకొండ మహా కుంభమేళాలో పాల్గొనడం, పవిత్ర స్నానం చేయడం ఆయన ఆధ్యాత్మిక విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. బిజీ షెడ్యూల్ లో తల్లితో కలిసి భక్తి మార్గంలో పయనించడం విశేషం. ఇకపోతే, VD12 మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో రానున్న ఈ టీజర్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచనుంది.