mohan babu kannappa

మహదేవ్‌ శాస్త్రిగా మోహన్‌ బాబు

కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని పలు పాత్రలను పరిచయం చేసిన డైరెక్టర్ తాజాగా మోహన్‌ బాబు లుక్ షేర్ చేశాడు. ఇందులో మహదేవ్‌ శాస్త్రిగా కనిపించనున్నట్టు తెలియజేస్తూ ప్రీ లుక్‌ విడుదల చేశారు. ఫుల్ లుక్‌ను నవంబర్ 22న లాంచ్ చేయనున్నట్టు తెలియజేశారు. ఇందులో మోహన్‌ బాబు పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతున్నట్టు ప్రీ లుక్‌ చూస్తే అర్ధం అవుతుంది. ఇప్పటికే కన్నప్ప నుంచి లాంచ్‌ చేసిన టీజర్‌, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

Advertisements

ఇక కన్నప్ప నుంచి తిన్నడు, ముండడు, చండుడు, మారెమ్మ, పిలక-గిలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేయగా.. స్టిల్స్ ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్‌ అక్షయ్‌కుమార్‌ శివుడిగా కనిపించబోతున్నాడు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు.ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

Related Posts
నేటితో ముగియనున్న MLC ఎన్నికల ప్రచారం
MLC election campaign to en

తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. గత నెల రోజులుగా అసెంబ్లీ ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా ప్రణాళికాబద్ధంగా వివిధ పార్టీలు Read more

బొమ్మలతో ఘనంగా జరిగిన రిపబ్లిక్ డే ఢిల్లీ
బొమ్మలతో ఘనంగా జరిగిన రిపబ్లిక్ డే .ఢిల్లీ.

ఈ రోజు భారత రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్భంగా, ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన పరేడ్ అదో అద్భుతమైన దృశ్యంగా మారింది. ఈ పరేడ్ దేశం Read more

ఫ్యాషన్ ప్రపంచంలోకి ‘ద వన్ అండ్ వోన్లీ ’
'The One and Only' way into the world of iconic and today's latest fashion

ముంబయి : బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ ఇప్పటి వరకు తమ అత్యంత గొప్ప ఎడిషన్ ను విడుదల చేసింది. ఫ్యాషన్ కేవలం ప్రారంభం మాత్రమే అయిన Read more

Indian Army: పాక్‌కు భారత్‌ ఘాటు ప్రతీకారం
Indian Army: పాక్‌కు భారత్‌ ఘాటు ప్రతీకారం

హల్గామ్ (Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ తర్వాత భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తలు తీవ్రతరం అయ్యాయి. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. Read more

Advertisements
×